ఆ జీపు పంపిస్తే మాత్రమే షూటింగ్ కు వస్తానని చెప్పిన బాలయ్య.. ఏమైందంటే?

నందమూరి నటసింహం బాలకృష్ణకు ఈతరం ప్రేక్షకులలో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. అఖండ సినిమాతో సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న బాలకృష్ణ తర్వాత ప్రాజెక్ట్ లపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే హిట్ కాంబినేషన్ అని చాలామంది అభిమానులు భావిస్తున్నారు. అయితే బాలయ్య బి.గోపాల్ కాంబినేషన్ కూడా సూపర్ హిట్ కాంబినేషన్ అనే సంగతి తెలిసిందే.

బాలయ్య బి.గోపాల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమాలలో రౌడీ ఇన్ స్పెక్టర్ సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. బాలయ్య ఖాకీ డ్రెస్ లో ఈ సినిమాలో అద్భుతంగా నటించి మెప్పించారు. పోలీసులు నిజ జీవితంలో ఏ విధంగా ప్రవర్తిస్తారో గమనించి స్టార్ హీరో బాలకృష్ణ ఈ సినిమాలో నటించడం గమనార్హం. ఈ సినిమా షూటింగ్ సమయంలో పోలీస్ జీప్ పంపిస్తే మాత్రమే బాలయ్య షూటింగ్ కు వచ్చేవారని సమాచారం.

ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒకరోజు బాలయ్య డైరెక్టర్ కు ఫోన్ చేసి నేను ఈరోజు షూటింగ్ కు రావడం లేదని చెప్పారు. ఏం జరిగింది బాబు అని డైరెక్టర్ అడగగా సినిమాలో తాను వాడుతున్న జీపును పంపిస్తే మాత్రమే షూటింగ్ కు వస్తానని అప్పుడు మాత్రమే తాను పాత్రలో లీనం కావడం సాధ్యం అవుతుందని బాలయ్య చెప్పారని సమాచారం. ప్రతిరోజూ ఏసీ కారులో వచ్చే బాలయ్య ఆరోజు నుంచి జీపులో వచ్చారని సమాచారం.

సినిమా అంటే బాలయ్యకు ఫ్యాషన్ అని ఆరోజు నుంచి బాలకృష్ణ అదే విధంగా వచ్చారని బి.గోపాల్ చెప్పుకొచ్చారు. బాలయ్య తన సినీ కెరీర్ విషయంలో ప్రస్తుతం ఎంతో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్టార్ హీరో బాలకృష్ణ తర్వాత సినిమాలతో కూడా సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.