ప్రభాస్ పై దిశ పటాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆయన ప్రేమను మర్చిపోవడం అంత తేలిక కాదు..!

వరుణ్ తేజ్ హీరోగా నటించిన లోఫర్ సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ దిశా పటాని .ఈ సినిమాలో ఈ అమ్మడు తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయినప్పటికీ ఈమెకు తెలుగులో అవకాశాలు లభించకపోవడంతో బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. బాలీవుడ్ లో ఎంఎస్ ధోని, భాగీ 2, భాగీ 3, రాధే వంటి సూపర్ హిట్ సినిమాలలో నటించిన ఈ అమ్మడు హీరోయిన్ గా మంచి గుర్తింపు ఏర్పరచుకుంది. ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ లో మరికొన్ని సినిమాలతో పాటు ప్రభాస్ హీరోగా నటిస్తున్న ” ప్రాజెక్ట్ కె ” సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది.

ఈ సినిమాలో దీపికా పదుకొనే మెయిన్ హీరోయిన్ గా నటించగా దిశా పటాని సెకండ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ అమ్మడు ఈ సినిమా షూటింగ్ పనులలో పాల్గొనింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం దిశా పటాని నటించిన ‘ఏక్‌ విలన్‌ రిటర్న్‌’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్ పనులు మొదలయ్యాయి. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దిశా పటాని ఇటీవల ఒక ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ క్రమంలో ఈ అమ్మడు ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ ఇంటర్వ్యూలో దిశా పటాని ” ప్రాజెక్ట్ కె ” సినిమా విశేషాల గురించి మాట్లాడుతూ.. ప్రభాస్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రభాస్ కి ఎప్పుడు స్టార్ట్ హీరో అని ఫీలింగ్ ఉండదు. నేను ఇప్పటివరకు పనిచేసిన మంచి నటులలో ప్రభాస్ కూడా ఒకరు. ఎంత మంచి వారన్నది నేను దగ్గర నుండి చూశాను. అందరూ చెప్పినట్లుగానే ప్రభాస్ తన ఇంటి నుండి భోజనం తెప్పించి టీం మొత్తానికి తానే స్వయంగా వడ్డించాడు. ప్రభాస్ చూపించే ప్రేమను మర్చిపోవటం అంత తేలికైన విషయం కాదు. ప్రభాస్ తో కలిసి నటించడం చాలా సులభం. ఆయనతో నటించడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఈ అమ్మడు ప్రభాస్ పై ప్రశంసలు కురిపించింది.