Radha Shyam : ఇండస్ట్రీ బజ్ : మోస్ట్ అవైటెడ్ “రాధే శ్యామ్” కి కూడా కొత్త తేదీ ఫిక్స్ అయ్యిందా??

Radha Shyam : పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా డస్కీ హీరోయిన్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ది మోస్ట్ అవైటెడ్ చిత్రం “రాధే శ్యామ్” కోసం అభిమానులు సహా పాన్ ఇండియా వీక్షకులు ఎంత స్థాయిలో ఎదురు చూస్తున్నారో అందరికీ బాగా తెలుసు. అయితే ఈ సినిమా సహా మరిన్ని భారీ చిత్రాలు ఈ జనవరిలో రిలీజ్ కావాల్సినవి చివరి నిమిషంలో ఆగిపోయాయి.

ఇక ఇదిలా ఉంటే ఈ మూడో వేవ్ లో కేసులు అమాంతం పెరుగుతున్నాయి కానీ ముందు వ్యాక్సిన్ వేసుకున్న వారు అధికంగా వుండడంతో ప్రాణ నష్టం తక్కువ ఉంది కావున చిత్ర నిర్మాతలు త్వరపడుతున్నారు. త్వరలోనే పరిస్థితి చక్కబడొచ్చని ఫాస్ట్ డేట్ లనే లాక్ చేస్తున్నారు మరి అలానే ఇప్పుడు రాధే శ్యామ్ బృందం కూడా ఒక డేట్ ని ఫిక్స్ చేసారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

మరి ఈ కొత్త అప్డేట్ ప్రకారం వచ్చే మార్చ్ 18న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేయ్యాలని అనుకుంటున్నారట. అప్పటికి మూడో వేవ్ తగ్గొచని అందుకే సాధ్యమైనంత త్వరగా చిత్రాన్ని రిలీజ్ చేసేయ్యాలని చూస్తున్నారట. మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక ఈ భారీ సినిమాని యంగ్ దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించగా యూవీ క్రియేషన్స్ వారు దాదాపు 300 కోట్ల వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మాణం వహించారు.