ఇండస్ట్రీ టాక్ : “ఆదిపురుష్” ఫస్ట్ కాపీ అంత సేపు వచ్చిందా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన లేటెస్ట్ చిత్రాల్లో ఆల్రెడీ రిలీజ్ కి రెడీగా ఉన్నటువంటి చిత్రాల్లో బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “ఆదిపురుష్” కూడా ఒకటి. మరి దీనిపై అనేక అంచనాలు నెలకొనగా మరోపక్క పలు డౌట్స్ కూడా గట్టిగానే ఉన్నాయి.

ఇక ఈ సినిమాని అయితే రామాయణం నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించగా రామునిగా ప్రభాస్ సీతగా కృతి సనన్ నటించారు. మరి ఈ సినిమా అయితే వచ్చే ఏడాదికి రిలీజ్ కానుండగా ఇప్పుడు చిత్ర యూనిట్ అంతా కూడా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు.

ముఖ్యంగా గ్రాఫిక్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తుండగా ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ సమాచారం బయటకి వచ్చింది. ఈ చిత్రాన్ని ఫైనల్ కాపీ రెడీ చెయ్యగా అది ఏకంగా 3 గంటల 116 నిమిషాలు వచ్చిందట. దీనితో అయితే ఓంరౌత్ ఇప్పుడు ఈ సినిమాని ట్రిమ్ చేసే పనిలో పడ్డాడట.

ఈ సినిమాలో కొన్ని చిన్న పాటి సీన్స్ ని కట్ చేసి ఫైనల్ అవుట్ పుట్ ని అయితే తాను సెన్సార్ ని పంపనున్నాడట. మరి ఇంతసేపు సినిమా అయినా పర్వాలేదు కానీ ఏమాత్రం విజువల్స్ తేడాగా ఉన్నా కూడా సినిమా పై డెఫినెట్ గా చాలా ప్రభావం పడుతుంది.