హాలీవుడ్ సినిమాలలో ఇండియన్ ఎప్పటికీ హీరో కాలేడు… అడివి శేష్ షాకింగ్ కామెంట్స్!

క్షణం, హిట్ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న హీరో అడివి శేషు ప్రస్తుతం మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న మేజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ 3వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మొట్టమొదటిసారిగా మహేష్ బాబు ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు.శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈయన బుల్లితెరపై ప్రసారమవుతున్న ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరయ్యారు.

తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ప్రోమోలో భాగంగా అడివి శేష్ ఎన్నో విషయాలను అలీతో కలిసి సరదాగా ముచ్చటించారు. ఇకపోతే తన తల్లిదండ్రులు ఒకరు తెలంగాణ ఒక హైదరాబాద్ కి చెందిన వారని అయితే ప్రస్తుతం వారు అమెరికాలో స్థిరపడ్డారని అడివి శేష్ వెల్లడించారు.ఇక తన తల్లిదండ్రులు అమెరికాలో ఉన్నారని చెప్పగానే అలీ తనను ప్రశ్నిస్తూ అమ్మానాన్న అమెరికాలో స్థిరపడ్డారు నువ్వు కూడా ఎంతో అందంగా ఉన్నావ్ ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతున్నావు మరి అక్కడ సినిమాలో నటించకుండా తెలుగు సినిమాలో నటించడానికి కారణం ఏమిటి అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు అడవి శేష్ సమాధానం చెబుతూ అమెరికా చిత్రాలలో భారతీయులకు ఎలాంటి పాత్రలు ఇస్తారనే విషయం గురించి చెబుతూ అక్కడ ఒక ఇండియన్ ను టెర్రరిస్టుగా, పెట్రోల్ బంకులలో పనిచేసే వ్యక్తిగా చూపిస్తారు. అక్కడ ఎంతో మంచి గుర్తింపు వచ్చినప్పటికీ అమెరికా సినిమాలలో భారతీయులు హీరో కాలేడు కేవలం కమెడియన్ పాత్రలకు మాత్రమే పరిమితం కావాల్సి ఉంటుంది. అందుకే తనకు హాలీవుడ్ చిత్రాల్లో నటించడం ఇష్టం లేదని ఈ సందర్భంగా అడివి శేష్ వెల్లడించారు.