Crime News: తమిళనాడు లో దారుణం… రైలు ఢీకొని ముగ్గురు యువకుల మృతి…!

Crime News: యువతీ, యువకులు టెక్నాలజీని ఎంతలా ఉపయోగిస్తున్నారు అంటే, వారు బయట మాట్లాడటం, తిరగడం కన్నా ఫోన్ లలోనే రోజు ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. టిక్ టాక్, ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా లలో తమ వీడియోలను అప్లోడ్ చేసేవారు అనేకం. వారు ఏ పని చేసిన సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం ఆనవాయితీగా మార్చుకున్నారు. ఇప్పుడున్న ఈ ఆధునికయుగంలో టెక్నాలజీ బాగా వినియోగిస్తున్నారని సంబరపడాలో లేకపోతే దీనివల్ల కొన్ని సందర్భాలలో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు అని బాధ పడాలో అర్థం కాని పరిస్థితి నడుస్తోంది. ఇటువంటి సంఘటనే తమిళనాడులో చోటు చేసుకుంది. ఇన్ స్టా రీల్స్ ముగ్గురు ముగ్గురు విద్యార్థులు రైలు ఢీకొట్టడంతో మృత్యువాత పడ్డారు.

వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా సింగ పెరుమాళ్ ఆలయం పక్కనే ఉన్న చెట్టిపున్నియం ప్రాంతానికి చెందిన ప్రకాష్ (17), మోహన్ (17), అశోక్ కుమార్ (24) ముగ్గురు స్నేహితులు. వీరిలో మోహన్ ప్రకాష్ తాంబరం లోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్నారు. ఈ ముగ్గురు ఎక్కువగా రైల్వే ట్రాక్ మీద సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ ఎప్పుడూ సోషల్ మీడియా, ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉండేవారు.

ఈ క్రమంలో ఎప్పటిలాగే తాంబరం- చెంగల్పట్టు మధ్య మూడో రైల్వే ట్రాక్ పై ఈ ముగ్గురు కూర్చుని ఇన్స్టా రీల్స్ చేస్తున్నారు. అదే సమయంలో లో చెన్నై తాంబరం నుండి విల్లుపురం వెళుతున్న రైలు, వేగంగా వచ్చి వారిని ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి వాత పడ్డారు. విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇప్పుడు అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.