Crime News: శ్రీకాకుళం జిల్లాలో దారుణం.. హాస్టల్ గదిలో నర్సింగ్ విద్యార్థి ఆత్మహత్య..!

Crime News: రాత్రి ఫ్రెండ్ బర్త్ డే నీ సెలబ్రేట్ చేసి ఎంజాయ్ చేసిన విద్యార్థి ఉదయానికల్లా రూమ్లో ఫ్యాన్ కి వేలాడుతూ కనిపించింది. రాత్రికి రాత్రే ఆమె ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం ఈ ఘటన సంచలనం రేపుతోంది. వివరాలలోకి వెళితే.. శ్రీకాకుళం పట్టణంలో మజ్జి పావని అనే నర్సింగ్‌ విద్యార్థిని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఓ హాస్టల్‌లో ఉంటోంది. ఫిబ్రవరి 27వ తేదీ.. మంగళవారం రాత్రి తన ఫ్రెండ్ పుట్టినరోజు సందర్భంగా తానే స్వయంగా కేక్ తెచ్చి కట్ చేయించి అందరూ కలిసి రూమ్‌లోనే బర్త్‌డే సెలబ్రేట్‌ చేసుకున్నారు.  రాత్రి పుట్టినరోజు వేడుకలు ముగిసిన తర్వాత అందరూ ఎవరి రూమ్ కి వారు వెళ్లిపోయారు.

పావని రూంలో ఉండే తోటి విద్యార్థులు నైట్ షిఫ్ట్ డ్యూటీ ఉండటంతో వారు హాస్పిటల్ కి వెళ్ళారు. ఐతే వారు తెల్లారి హాస్పిటల్ నుండి వచ్చి చూస్తే ఒక్కసారిగా షాక్ అయ్యారు. రాత్రి తమతో పాటు సంతోషంగా ఉన్న తమ స్నేహితురాలు ఇలా ఆత్మహత్య చేసుకోవటంతో అందరూ షాక్ అయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఘటన గురించి విచారించారు. పోలీసుల ప్రాథమిక విచారణలో పావని ఆత్మహత్య చేసుకొని మరణించినట్టు నిర్ధారించారు. కానీ పావని ఆత్మహత్యకు గల కారణాల గురించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తమ కూతురు మరణవార్త విన్న తల్లిదండ్రులు బోరున విలపించారు. కుటుంబం పట్ల ఎంతో బాధ్యతగా ఉన్న పావని చదువుకుంటూనే కుటుంబ బాధ్యతలు తీసుకొని వారి కోసం ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదించండి అని కుటుంబ సభ్యులు వెల్లడించారు. మరోవైపు పోలీసులు పావనిది హత్యగా అనుమానిస్తూ
క్లూస్‌ టీమ్‌తోపాటు స్నిఫర్‌ డాగ్స్‌ని రంగంలోకి దించారు. ఈ ఈ ఘటన గురించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.