అసలు ఎవరు రా ఉండవల్లి శ్రీదేవి ని ఈ రేంజ్ లో టార్గెట్ చేస్తున్నారు ? పెద్ద ముఠా ఉందా ?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన వివాదాల్లో ఎక్కువగా వినిపించే పేరు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. నిత్యం ఎదో ఒక వివాదంలో శ్రీదేవి పేరు వినిపిస్తుంది. అసలు ఎందుకు ఈ ఎమ్మెల్యే సంబంధించిన వివాదాలు మాత్రమే బయటకు వస్తాయో కూడా అర్ధం కావడం లేదు. ఇప్పటి వరకు ఆమెకు సంబంధించిన వివాదాస్పదమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమెకు సంబంధించిన ఆడియో క్లిప్స్, వీడియోస్ ప్రతి నిత్యం ఎదో ఒకటి బయటకు వస్తుంది.

వివాదాల పుట్టగా మారిన శ్రీదేవి

మొదట్లో ఎంఎల్ఏ అసలు ఎస్సీనే కాదనే వివాదం మొదలైంది. తర్వాత ఎస్సీ ఎంఎల్ఏగా ఉండి అంబేద్కర్ ను కించపరుస్తు మాట్లాడారనే వివాదం రేగింది. ఆ తర్వాత బాపట్ల ఎంపి నందిగం సురేష్ తో విభేదాలు బయటపడ్డాయి. ఎంపితో విభేదాలే చాలా కాలం నడిచాయి ఈమధ్య పార్టీలోనే ఒకపుడు తనకు అనుచరులుగా ఉన్న సందీప్ తో పాటు మరో వ్యక్తితో విభేదాలు బయటపడ్డాయి వాళ్ళ మధ్య వివాదం తాలూకు ఆడియో టేపులు కూడా బహిర్గతమయ్యాయి. ఆ తర్వాత నియోజకివర్గంలో పేకాట క్లబ్బులను నడిపాలని ఎంఎల్ఏ చెప్పినట్లుగా ఉన్న మరో ఆడియో టేపును సందీపే రిలీజ్ చేశాడు. అలాగే ఇప్పుడు మరో వివాదంలో ఇరుక్కున్నారు. రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడిన ఆడియో టేప్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కావాలనే శ్రీదేవిని టార్గెట్ చేస్తున్నారా!!

రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్క నేత కుడా ప్రైవేట్ గా చాలా తప్పులు చేస్తూ ఉంటారు కానీ కేవలం శ్రీదేవి విషయాలు మాత్రమే ఎందుకు బయటకు వస్తున్నాయో అర్ధం కావడం లేదు. ఆమెను రాజకీయంగా దెబ్బతియ్యడానికా లేక వ్యతిగత కారణాల వల్లో తెలియదు కానీ శ్రీదేవికి సంబంధించిన విషయాలు మాత్రమే బయటకు వస్తున్నాయి. ఈ వివాదలన్నింటికి శ్రీదేవి ఎలా సమాధానం చెప్తారో వేచి చూడాలి.