Crime News: రాజస్థాన్ లో దారుణం.. తరగతి గదిలో విద్యార్థినిపై అఘాయిత్యం కి పాల్పడిన ఉపాధ్యాయుడు..!

Crime News: ఈ రోజుల్లో సమాజంలో మహిళలకు రక్షణ లేకుండా పోతోంది. మహిళలు చిన్న పిల్లలు ఒంటరిగా బయటికి వెళ్ళాలి అంటే చాలు భయపడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. ఆడది ఒంటరిగా కనిపిస్తే కొందరు మగవాళ్ళు మృగల్లా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఆఖరికి చిన్నపిల్లమీద కూడా కనికరం చూపటం లేదు. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిన ఉపాధ్యాయులే విద్యార్థినులపై గాయాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా రాజస్థాన్ లో జరిగిన సంఘటన ఇందుకు నిదర్శనం.

వివరాలలోకి వెళితే…రాజస్థాన్‌ నాగోర్ పట్టణంలోని పంచోరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ దారుణం చోటుచేసుకుంది. పాఠశాలలో పనిచేస్తున్న పిఈటీ ఉపాధ్యాయుడు హరే రామ్ బాలిక మీద హత్య యత్నానికి పాల్పడ్డాడు. బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి ఈ నెల 5వ తేదీన ఎవరూలేని గదిలోకి తీసుకెళ్లి బాలికను బలవంతం చేశాడు. సదరు బాలిక ఇంటికి వెళ్లి తల్లిదండ్రులతో తన బాధను చెప్పుకుంది.

ఈ క్రమంలోనే తల్లిదండ్రులకు ఇంకొక షాకింగ్ విషయం తెలిసింది. బాధితురాలి సోదరి మీద కూడా ఇంతకుముందు ఆ ఉపాధ్యాయుడు అత్యాచారం చేసినట్టు బాలిక తల్లిదండ్రులకు వెల్లడించింది. బాధితురాలి అక్క తొమ్మిదవ తరగతిలో ఉండగా పిటి ఉపాధ్యాయుడు ఆమెను అత్యాచారం చేశాడు. మరియొక సారి ఆమె పదవ తరగతిలో ఉండగా బాలిక మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులు ఏమంటారో అన్న భయంతో పెద్దకుమార్తె వారికి విషయం చెప్పలేక పోయింది. తన చెల్లెల్ని కూడా ఉపాధ్యాయుడు అత్యాచారం చేశాడని తెలియడంతో తన బాధను కూడా తల్లిదండ్రులతో చెప్పుకుంది.

తమ ఇంటి ఆడ పిల్లల మీద ఇలా అత్యాచారానికి పాల్పడిన ఉపాధ్యాయుడు మీద తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుడు మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఉపాధ్యాయుడు మీద కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.