Crime News:పండగపూట నిర్మల్ జిల్లాలో దారుణం.. వివాహిత అనుమానాస్పద మృతి..!

Crime News: భారతదేశంలో వివాహ బంధానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు నమ్మకం గా ఉంటూ అన్ని విషయాలలో ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం వల్ల ఎటువంటి మనస్పర్థలు రాకుండా ఉంటాయి.కానీ ప్రస్తుత కాలంలో పాశ్చాత్య సంస్కృతి బాగా అలవాటు పడి వివాహ బంధం కూడా మూడునాళ్ళ ముచ్చట గా మారిపోయింది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం వల్ల విడాకులు తీసుకోవడం, హత్యలకు పడటం వంటి నేరాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల నిర్మల్ జిల్లాలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే..భార్య మీద అనుమానం వల్ల భర్త తరచు వేధిస్తూ ఉండేవాడు.మంజులాపూర్‌కు చెందిన అరుగుల సాయికృష్ణకు ఎనిమిదేళ్ల క్రితం కుంటాల మండల కేంద్రానికి చెందిన ప్రణీత(24)తో వివాహమైంది. ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న వీరి జీవితంలో భార్య మీద అనుమానం వల్ల తరచూ ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి. తాజాగా మంగళవారం వారిద్దరి మధ్య గొడవ జరగడంతో ప్రణీత బాత్రూంలో షవర్ కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పుట్టిన ప్రణీతను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఇదిలా ఉండగా తమ కూతురు ఆత్మహత్యకు తన వేధింపులే కారణమని వారి మీద తగిన చర్యలు తీసుకోవాలని ప్రణీత తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ ఎదురుగా ధర్నాకు దిగారు. ప్రణీత భర్త, అత్త కలిసి తమ కూతురిని హత్య చేసి ఉంటారని వెంటనే వారిని అరెస్టు చేయాలని ప్రణీత తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ప్రణీత సోదరుడు ప్రవీణ్ చేసిన ఫిర్యాదు మేరకు ప్రణీత భర్త సాయి కృష్ణ, అత్త లక్ష్మీ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.