Crime News: మేడ్చల్ జిల్లాలో దారుణం.. భర్త వేధింపులు భరించలేక పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య..!

Crime News: ప్రతి మహిళ పెళ్లి తర్వాత అత్తవారింట్లో సంతోషంగా ఉండాలని ఎన్నో కలలు కంటుంది. కానీ కొందరి జీవితాల్లో మాత్రం ఈ కలలన్నీ కలలుగానే మిగిలిపోతాయి . అతిధి వారు భర్త పెట్టే వేధింపులు భరించలేక కొందరు మహిళలు విడాకులిచ్చి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి పోతుంటే మరికొందరు మాత్రం అత్తింటి వారి బాధలు భరించలేక పుట్టింటి వారికి భారం కాలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఇటీవల మేడ్చల్- మల్కాజ్గిరి జిల్లా లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నవమాసాలు కని పెంచిన తల్లి తన ముగ్గురు పిల్లలతో సహా చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. తల్లి, ఇద్దరు పిల్లలు మృతి చెందగా మరొక బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

వివరాల్లోకి వెళితే…. మేడ్చల్ మండలం రాజా బొల్లారం గ్రామం లో నివాసం ఉండే బిక్షపతి, మమత దంపతులకు ముగ్గురు పిల్లలు. వీరికి ఒక కుమార్తె ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రతిరోజు ఇంట్లో వీరిరువురి మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ మధ్యకాలంలో వారిద్దరి మధ్య గొడవలు ఎక్కువ కావడంతో భర్త పెట్టే వేధింపులు అధికమయ్యాయి. ఇంట్లో రోజురోజుకి ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోయి, భర్త పెట్టే వేధింపులు కూడా ఎక్కువ అవటంతో మమత తీవ్ర మనస్తాపానికి గురైంది.

ప్రతిరోజు భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకోవడం మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం అని భావించింది.ఈ క్రమంలో నవమాసాలు మోసి కనిపెంచిన పిల్లల్ని కూడా తనతో పాటు తీసుకొని వెళ్లి ఊరి శివారులో ఉన్న చెరువు లోకి దూకి ఆత్మహత్య కు పాల్పడింది. ఈ ఘటనలో మమత తో పాటు పాప (3), చిన్న కుమారుడు (1) మృతి చెందగా…. స్థానికులు పెద్ద కుమారుడిని రక్షించారు. స్థానికులు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను చెరువు నుండి వెలికి తీశారు. మృతదేహాలను పోస్టమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.