Crime News: మహబూబాబాద్‌ జిల్లాలో దారుణం.. చిన్నారి చేతిపై వాతలు పెట్టిన అంగన్వాడీ కార్యకర్త..!

Crime News: ఇటీవల కాలంలో పాఠశాలలో తరచూ మూత్ర విసర్జనకు వెళ్తున్నాడు అని చిన్నారిని చితకబాదిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఆ ఘటన గురించి ఇంకా మరువకముందే ఇటీవల తాజాగా అంగన్వాడి సెంటర్ కు వెళ్లలేదని అంగన్వాడీ కార్యకర్త వాతలు పెట్టింది. ఈ దారుణమైన సంఘటన ప్రస్తుతం అందరి మనసులను కలచివేస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

డోర్నకల్​ సీఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా, డోర్నకల్‌ మండలం, బూరుగుపాడు గ్రామంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రాయబారపు రమేష్​, కుమారి దంపతులకు వాసవి అనే నాలుగేళ్ల కుమార్తె ఉంది. ఇటీవల చిన్నారి గత రెండు రోజులుగా అంగన్వాడీ కేంద్రానికి వెళ్లలేదు.ఈ క్రమంలో గుడ్లు తీసుకురావటానికి చిన్నారి నాయనమ్మ ఉప్పలమ్మ, తల్లి కుమారి వాసవి ని తీసుకుని అంగన్వాడీకిి వెళ్లారు. అక్కడున్న అంగన్‌వాడీ కార్యకర్త వారిని కులం పేరుతో దూషించడమే కాకుండా అంగన్వాడీ కేంద్రానికి రానందుకు చిన్నారిని లోపలికి లాక్కెళ్లి కుడిచేతిపై వాతలు పెట్టింది.

వెంటనే తల్లిదండ్రులు గాయపడిన చిన్నారి ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు అంగన్వాడీ కార్యకర్తల మీద పోలీసులకు ఫిర్యాదు చేయగా అంగన్‌వాడీ టీచర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు అంగన్వాడీ టీచర్ నీ విచారించగా ఈ ఘటనకు తనకు ఎటువంటి సంబంధం లేదని, చిన్నారి మీద తాను చేయి చేసుకోలేదని పోలీసులకు వివరణ ఇచ్చారు.