Radhe Shyam : ఫ్యాన్స్ ఆవేదన – లాస్ట్ చేసి “రాధే శ్యామ్” పై ఈ ట్విస్ట్ ఏంటి బాసు..?

Radhe Shyam : జస్ట్ ఈ ఒక్క రోజులో పాన్ ఇండియా ప్రేక్షకులు మరో బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్ ని వెండితెరపై చూడనున్నారు. ఆ సినిమానే “రాధే శ్యామ్”. పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రేమకి, విధికి మధ్య జరిగే భయానక యుద్ధంలో గెలుపు ఎవరిది అనే ఆసక్తికర నేపథ్యంలో తెరకెక్కించారు.
దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రభాస్ కెరీర్ లోనే మరో మోస్ట్ అవైటెడ్ సినిమాగా రిలీజ్ కి సిద్ధంగా ఉంది. సరే ఇది బాగున్నా ఏపీలో ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్ లో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేపే సినిమా రిలీజ్ అయినా ఇంకా ఎక్కడా కూడా ఈ సినిమా ఆన్లైన్ బుకింగ్స్ ఓపెన్ కాకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తుంది.
దీనితో సోషల్ మీడియాలో వారి ఆవేదన అంతా ఇంత కాదు. అన్ని చోట్లా బుకింగ్స్ ఓపెన్ అయ్యి ఒక్క ఏపీలోనే లాస్ట్ చేసి ఇంకా ఓపెన్ కాకపోవడం ఊహించని ట్విస్ట్ గా మారింది. మరి ఈ బుకింగ్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయో చూడాలి. ఇక ఈ భారీ సినిమా మొత్తం 5 భాషల్లో రిలీజ్ అవుతుండగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.