Crime News: కర్నూలు జిల్లాలో దారుణం… తోడబుట్టిన చెల్లెల్ని ఎలకల మందు పెట్టి చంపిన అక్క..!

Crime News: ఈ మధ్యకాలంలో మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయతలు కరువయ్యాయి. ఎదుటివారు బాగుపడితే ఓర్చుకోలేక వారి నాశనాన్ని కోరుకుంటున్నారు. ఇటీవల కర్నూలు జిల్లాలో కూడా దారుణ ఘటన చోటుచేసుకుంది. కొన్ని కారణాల వల్ల అక్క, చెల్లి ఇద్దరిని పెళ్లి చేసుకున్న వ్యక్తి. తన భర్త తనకంటే చెల్లినే ఎక్కువ ప్రేమగా చూసుకుంటున్నాడు అనే అక్కసుతో చెల్లిని చంపిన అక్క. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల మేరకు …జానకమ్మ, తిరుమలేశ్వరి ఇద్దరు అక్క చెల్లెళ్ళు. కొన్ని సంవత్సరాల జానకమ్మ కు జనార్ధన్ అనే వ్యక్తి తో వివాహం జరిగింది. వివాహం జరిగిన కొన్ని రోజులు వీరి జీవితం సాఫీగానే సాగింది. అయితే కొన్ని రోజుల తర్వాత జానకమ్మ ఆరోగ్యం క్షీణించింది. ఎన్ని రోజులకు ఆమె ఆరోగ్యం కుదుట పడకపోవడంతో కుటుంబ సభ్యుల నిర్ణయం మేరకు జానకమ్మ చెల్లి అయిన తిరుమలేశ్వరిని జనార్ధన్ కు ఇచ్చి పెళ్లి చేసారు. వీరి వివాహం రెండేళ్ల క్రితం జరిగింది.

ఈ నేపథ్యంలో రెండో భార్య తిరుమలేశ్వరికి దగ్గరైన జనార్ధన్ మొదటి భార్యను పట్టించుకోవడం మానేశాడు. తిరుమలేశ్వరికి బాగా దగ్గరయ్యాడు. తన కట్టుకున్న భర్త తన నుండి దూరం అవుతున్నాడని, తనకంటే చెల్లెలితోనే ఎక్కువ సమయం గడపడాన్ని జీర్ణించుకోలేక పోయిన జానకమ్మ అక్కసుతో రక్తం పంచుకొని పుట్టిన సొంత చెల్లి అని కూడా చూడకుండా తినే అన్నం లో ఎలుకల మందు కలిపి వడ్డించింది. ఆ అన్నం తిన్న తిరుమలేశ్వరి మృతిచెందింది. జానకమ్మ తన భర్త జనార్ధన్ కి విషయం చెప్పడంతో, ఇద్దరు కలసి మృతదేహాన్ని దగ్గర్లో ఉన్న అడవిలో పడేసి వచ్చారు. ఘటనపై పోలీసులకు మంగళవారం సమాచారం రావడంతో జానకమ్మ, జనార్ధన్ లను కొత్తపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.