Crime News: కర్నూల్ జిల్లాలో దారుణం.. కనికరం లేకుండా కన్న బిడ్డల్ని బావిలో తోసిన తల్లి..!

Crime News: దేశంలో రోజు రోజుకి క్రైమ్ రేటు పెరుగుతూనే ఉంది. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాలు, వివాహేతర సంబంధాలు, ఆస్తి తగాదాలు ఇలా ఎన్నో కారణాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ తగాదాలలో క్షణికావేశంలో కొంత మంది ప్రాణాలు తీసుకుంటుంటే మరికొంతమంది ఎదుటివారిని చేయడానికి కూడా వెనకాడటం లేదు. తాజాగా కర్నూలు జిల్లాలో జరిగిన సంఘటన అందరినీ కలిచివేస్తోంది. నవమాసాలు మోసి కన్నతల్లి తనకి ఏం కష్టం వచ్చిందో మరి పిల్లలిద్దరినీ బావిలో తోసేసి తను కూడా బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవటానికి పాల్పడింది. ఈ క్రమంలో దేవుడు పిల్లలిద్దర్నీ తీసుకెళ్ళు తల్లిని మాత్రం వదిలేశాడు.

వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా, పూలతోట గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది.భార్య భర్తల మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా మనస్తాపానికి గురైన భార్య ఆవేశంలో దారుణానికి పాల్పడింది. భార్య భర్తల మధ్య వచ్చిన కలహాలకు పసిపిల్లల ఇద్దరు బలైపోయారు. నవమాసాలు మోసి కన్న తల్లి పిల్లల మీద కనికరం చూపకుండా తనతో పాటు వారిని కూడా చంపాలని ఉద్దేశంతో ఇద్దరిని బావిలో తోసేసి తను కూడా బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కానీ ఈ ఘటనలో పిల్లలు ఇద్దరు మరణించగా తల్లి మాత్రం ప్రాణాలతో బయటపడింది.

ఇంట్లో ముసిముసి నవ్వులతో ఆడుతూ పాడుతూ తిరిగే పిల్లలు ఇలా విగత జీవులుగా కనిపించడంతో బంధువులందరూ బోరున విలపిస్తున్నారు. సమాచారం అం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఈ ఘటనకు సంబంధించిన విషయాల గురించి స్థానికులను విచారిస్తున్నారు.ఈ దారుణానికి కుటుంబ కలహాలే కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి ఇ దర్యాప్తు చేపట్టారు.