Crime News: కృష్ణా జిల్లాలో దారుణం.. ఏడేళ్ల చిన్నారిపై యువకుడి అఘాయిత్యం..!

Crime News: ప్రస్తుత కాలంలో ఆడవాళ్లకు రక్షణ బాగా కరువైపోయింది. చిన్నపిల్లలు ముసలివారు అని చూడకుండా రక్త సంబంధాలను సైతం మరచి కొందరు దుర్మార్గులు ఆడవారిపై అఘాయిత్యానికి పాల్పడుతున్నారు. ప్రస్తుతం సమాజంలో అత్యాచారాలకు, లైంగిక వేధింపులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. మహిళల రక్షణ కై అటువంటి దుర్మార్గులను శిక్షించడానికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఆగడాలకు అంతే లేకుండా పోతోంది. ఇటీవల కృష్ణా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చిన్న పాప అని కూడా చూడకుండా ఏడేళ్ల చిన్నారిపై ఒక దుర్మార్గుడు నీచానికి పాల్పడ్డాడు.

వివరాలలోకి వెళితే..కృష్ణా జిల్లా విజయవాడ గ్రామీణ మండలం నున్న గ్రామంలో భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ముగ్గురు సంతానం.వీరిలో ఏడేళ్ల వయసున్న రెండో కుమార్తె.. గ్రామంలో ఉన్న ఓ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. ప్రతిరోజు పాఠశాలకు వెళ్లి వచ్చేది. ఈ క్రమంలో ఇటీవల బాలిక పాఠశాల నుండి తిరిగి వస్తున్న సమయంలో అనీల్ అనే వ్యక్తి చిన్నారికి మాయ మాటలు చెప్పి ఆమెను పక్కకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు.పాఠశాల నుండి ఇంటికి తిరిగి వచ్చిన కూతురు ముభావంగా ఉండటంతో తన తల్లి ఆందోళన చెంది ఏమైంది అని చిన్నారిని అడిగింది.

తన తల్లి ఇలా ప్రశ్నించడంతో చిన్నారి భయంతో జరిగిన విషయం చెప్పింది. ఈ విషయం గురించి చిన్నారిని లోతుగా ఆరా తీయగా.. అనిల్ అనే వ్యక్తి తన పాఠశాల నుండి తిరిగి వస్తున్న సమయంలో దుకాణానికి తీసుకువెళ్లి తనని ఇబ్బంది పెట్టాడని చిన్నారి చెప్పుకొచ్చింది. చిన్నారి మాటలు విన్న తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహానికి గురై పాల్పడిన అనిల్ అనే వ్యక్తి పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ దుర్మార్గుడి పై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను వేడుకుంది. ఈ ఘటనకు పాల్పడిన నిందితుడిపై పోలీసులు ఫోక్సో యాక్ట్ చట్టం కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.