Crime News: కామారెడ్డిలో దారుణం.. సలసల కాగుతున్న నూనె అక్క పై పోసిన చెల్లి..!

Crime News: ఈ రోజుల్లో యువత ప్రేమకు ఆకర్షణ కు మధ్య తేడా తెలియకుండా గుడ్డిగా ప్రేమ అని మోసపోతున్నారు. ఆ ప్రేమ మాయలో ఉన్నప్పుడు వారికి బంధాలు, బంధుత్వాలు ఏవి గుర్తుండవు. కొంతమంది అబ్బాయిలు కూడా అమ్మాయిల వీక్నేస్ అవకాశంగా భావించి వారిని మోసం చేస్తున్నారు. ఒకరికి తెలియకుండా ఒకరితో ఇలా ఇద్దరూ, ముగ్గురు అమ్మాయిలతో ప్రేమ వ్యవహారాలు నడుపుతున్నారు. ఇటీవల కామారెడ్డి లో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే..కామారెడ్డిలోని అశోక్‌నగర్‌ కాలనీలో నివాసం ఉండే షేక్‌ చాందిని, నాగూర్‌బీలు అక్కాచెల్లెళ్లు. ఇద్దరు అక్కాచెల్లెళ్లకు ఇదివరకే పెళ్లిళ్లు జరిగి తమ భర్తలతో మనస్పర్థల కారణంగా వారి భర్తలకు దూరంగా ఉంటూ..ఎవరికి వారు వేర్వేరుగా అదే కాలనీలో నివాసం ఉంటున్నారు. ఇదిలా ఉండగా గత కొద్ది రోజులుగా చాందిని అనే మహిళకు శ్రీనివాస్‌ అనే వ్యక్తితో పరిచయం ఈ మధ్యకాలంలో వారిద్దరూ ఎంతో సన్నిహితంగా ఉంటున్నారు.

అయితే చాందిని చెల్లెలు నాగూర్‌బీ కూడా శ్రీనివాస్ అనే వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉంటుంది. ఐతే తన అక్క కూడా శ్రీనివాస్ తో సన్నిహితంగా ఉండటం గమనించిన నాగూర్‌బీ తన అక్క మీద కోపం పెంచుకుంది. తనతో సన్నిహితంగా ఉండే వ్యక్తితో తన అక్క కూడా అలాగే ఉండటం నాగూర్‌బీ జీర్ణించుకోలేక పోయింది. అక్కసుతో మంగళవారం రోజున నిద్రిస్తున్న తన అక్క చాందిని మీద బాగా మరుగుతున్న నూనెను పోసింది. ఈ ఘటనలో చాందిని తీవ్రగాయాల పాలవడంతో స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన గురించి చాందిని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.