Crime News: హన్మకొండ లో దారుణం… అనుమానాస్పదంగా మారిన యూనియన్ బ్యాంక్ మేనేజర్ మృతి..!

Crime News: ఆడపిల్లకు పెళ్లి జరిగిన తర్వాత ఎన్నో ఆశలతో అత్తవారింట్లో అడుగుపెడుతుంది. అక్కడ అ భర్త అత్తమామలు తో కలిసి సంతోషంగా ఉండాలని ఎన్నో కలలుగన్న మహిళలు వారి ఆశలు అడియాశలుగా మారిపోతున్నాయి. ప్రస్తుతం ఇలాంటి దారుణ సంఘటన ఒకటి హనుమకొండలో చోటుచేసుకుంది. అత్తింటి వారి వేధింపులు భరించలేక ఒక మహిళ ఆత్మహత్యకు పాల్పడిందన్న సమాచారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలలోకి వెళితే..

హనుమకొండ యూనియన్ బ్యాంక్ లో మేనేజర్ గా పని చేస్తున్న అనూష ఇటీవల ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని భర్త అత్తమామలు చెప్పగా.. భర్త వేధింపులు భరించలేకే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. బ్యాంకు మేనేజర్ గా పని చేస్తున్న అనూషకు అదే బ్యాంకు లో పని చేస్తున్న ప్రవీణ్ తో 2019 లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో అనూష పు 25 లక్షల డబ్బు, బంగారు ఆభరణాలు పెట్టుకో తెల్లగా పెట్టి ఎంతో ఘనంగా వివాహం జరిపించారు.

పెళ్లి జరిగిన సమయం నుండి ప్రవీణ్ అనూషను అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని అనూష మీద లేనిపోని అనుమానాలు పెట్టుకొని, ఆమెను వేధించేవాడని అనూష బంధుమిత్రులు తెలిపారు. బ్యాంకులో ఎవరితో మాట్లాడినా కూడా ఆమెను చిత్రహింసలకు గురి చేసే వాడని తల్లి తండ్రులు వాపోయారు.ఈ విషయం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన వారి నుండి ఎటువంటి స్పందన లేదని కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని అనూష తల్లిదండ్రులు వివరించారు.

అనూష భర్త అత్తింటివారు తనను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బంధువులు పోలీస్ స్టేషన్ ఎదురుగా నిరసన తెలియజేస్తున్నారు. ఈ విషయం గురించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.