Crime News: గద్వాల్ జిల్లాలో దారుణం.. ఇంటి ముందు ట్రాక్టర్ నిలబెట్టినందుకు హత్య..!

Crime News: ఈ రోజుల్లో ప్రజలు ఎదుటివారి మీద ప్రేమ, ఆప్యాయతలు, జాలి మరిచి చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో ఆస్తి తగాదాల, భోగి వివాదాల కారణంగా హత్యలు చేయటానికి కూడా వెనకాడటం లేదు. ఇటీవల జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏంటి ముందు ట్రాక్టర్ నిలబెట్టిన వ్యక్తిని దారుణంగా కొట్టి హత్య చేశారు. ప్రస్తుతం ఈ ఘటన చర్చనీయంగా మారింది.

వివరాల్లోకి వెళితే..కేటీదొడ్డి మండలం మల్లాపురంలో కుర్వ మల్లయ్య , కుర్వ గోవిందు అన్నదమ్ములు నివసిస్తున్నారు. వీరి ఇంటి పక్కనే బోయ రాఘప్పల మౌలాలి అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలం గురించి గత కొంత కాలంగా వీరి కుటుంబాల మధ్య భూ వివాదం నడుస్తోంది. ఇరు కుటుంబాల మధ్య తరచూ స్థలం కోసం గొడవలు జరుగుతూ ఉండేవి. ఈ విషయం గురించి గతంలో పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అవటం తో శనివారం ఈ వివాదం గురించి పంచాయతీ నిర్వహించారు. దీంతో సర్వేరు సహకారంతో రెండు కుటుంబాలకి హద్దులు చూపించారు.

ఇదిలా ఉండగా ఆదివారం సాయంత్రం బోయ రాఘప్పల మౌలాలి స్థలంలో కురువ గోవిందు ట్రాక్టర్ ఉంచాడు. దీంతో ఆదివారం సాయంత్రం మళ్లీ ఇరు కుటుంబాల మధ్య గొడవ మొదలైంది.మౌలాలి తన స్థలంలో ఉన్న ట్రాక్టర్ తీయటానికి వెళ్లలేదా గోవింద కుటుంబ సభ్యులు అతనిని కర్రలతో కొట్టి హత్య చేశారు. మౌలాలి మరణించడంతో అతని కుటుంబ సభ్యులు గోవింద ట్రాక్టర్ కి నిప్పుపెట్టి తగలబెట్టారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన గురించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.