రానున్న రోజుల్లో బాబు, జగన్ లు మోడీ నుండి ఇబ్బందులు ఎదుర్కొంటారా!!

రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. ఎవరు ఎవరినైనా భయపెట్టవచ్చు, ఎవరు ఎవరికైనా భయపడవచ్చు. అయితే ఇప్పుడు భారత రాజకీయాల్లో మాత్రం బీజేపీని, బీజేపీ నాయకులను చూసి దాదాపు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నాయకులు, అన్ని పార్టీల నాయకులు భయపడుతున్నారు. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డిలు కూడా ప్రధాని మోడీకి భయపడాల్సిన అవసరం వచ్చింది. బీజేపీతో కలవడానికి టీడీపీ ప్రాకులాడుతుంది అలాగే వైసీపీని తమలో కలుపుకోవడానికి బీజేపీ ప్రాకులాడుతున్నా నేపథ్యంలో మోడీ బాబు, జగన్ లకు షాక్ ఇవ్వనున్నారు.

What BJP is Doing if tdp and YCP Loots
What BJP is Doing if tdp and YCP Loots

అవినీతిపై యుద్ధం ప్రకటించిన మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ అవినీతి నిరోధం – విజిలెన్స్‌ జాతీయ సదస్సులో ప్రసంగించారు. ఈ క్రమంలో డొల్ల కంపెనీలు, అవినీతి కేసుల్లో జాప్యం వంటి అంశాల్ని ప్రస్తావించారు. త్వరలోనే ఇండియాలో అవినీతిని, అక్రమాలను, డొల్ల కంపెనీల పని పడతామని మోడీ ప్రకటించారు. దీంతో ఏపీ నేతలైన బాబు, జగన్ లకు రానున్న రోజులో ఇబ్బందులు రానున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే జగన్ పై అవినీతి ఆరోపణలు ఉన్నాయి అలాగే ఆయన కొన్ని రోజులు జైల్ కూడా వెళ్లారు. అలాగే చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు నారా లోకేష్ పై కూడా అవినీతి ఆరోపణలు, అక్రమ కంపెనీల ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో మోడీ అవినీతిపై యుద్ధం ప్రకటిస్తే బాబు, జగన్ లకు ఇబ్బందులు తప్పవు.

అవినీతిపై బీజేపీ యుద్ధం చెయ్యడమా!

బీజేపీ నాయకులు అవినీతిపై యుద్ధం చెయ్యడం అంటే చాలా కామెడీగా ఉందని ప్రతిపక్షాల నాయకులు అంటున్నారు. ఎందుకంటే బీజేపీలోనే ఎక్కువ మంది అవినీతిపరులు ఉన్నారని, ఒక మోడీ అవినీతిపై యుద్ధం ప్రకటిస్తే సగం మంది బీజేపీ నాయకులు జైళ్లలోనే ఉంటారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అలాగే మోడీ ప్రధానిగా గత ఆరు సంవత్సరాలుగా ఉన్నారు. ఈ కాలంలో ఎంతమంది అవినీతి పరులపై, అక్రమ కంపెనీలపై చర్యలు తీసుకున్నారని ప్రతిపక్షాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.