Crime News: అనంతపురం ప్రైవేట్ ఆసుపత్రిలో దారుణం… ఆపరేషన్ థియేటర్ లో సీసీ కెమెరాలు అమర్చి…!

Crime News: ఈ మధ్య కాలంలో హాస్పిటల్, షాపింగ్ మాల్స్, ఏ ఇతర షాప్ లో ఐన భద్రత కోసం సీసీ కెమెరాలు అమర్చుతున్నారు. కానీ కొంతమంది సీసీ కెమెరాలను అమర్చి నేరాలకు పాల్పడుతున్నారు. అనంతపురం జిల్లాలో స్థానికంగా ఉండే ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. ప్రైవేట్ హాస్పిటల్ లోని ఆపరేషన్ థియేటర్ లో సీసీ కెమెరాలు అమర్చి ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.

వివరాల్లోకి వెళితే… అనంతపురం జిల్లా రామ్ నగర్ కాలనీలో ఉండే ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో శస్త్ర చికిత్స కోసం వెళ్ళిన మహిళా ఫుటేజీని సీసీ కెమెరాల్లో రికార్డు చేయడంపై బంధువులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ఆదివారం అనంతపురం పట్టణం ఐదవ రోడ్డు కు చెందిన ఒక మహిళ మొలల నొప్పి భరించలేక ఆపరేషన్ కోసం రాంనగర్ లో ప్రైవేటు ఆసుపత్రికి వెళ్ళింది. అక్కడ డాక్టర్లు ఆదివారం శస్త్ర చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రిలో ఆపరేషన్ థియేటర్ కు తరలించి చికిత్స సమయంలో మొత్తం సీసీ కెమెరాలో నమోదు అయ్యింది.

ఆపరేషన్ థియేటర్ లో సీసీ కెమెరా ఉందని చెప్పిన డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆపరేషన్ చేశారని బంధువులు ఆగ్రహానికి గురయ్యారు. బంధువులకు పరమాన్నం వచ్చి సి సి ఫుటేజ్ లు పరిశీలించగా మొత్తం రికార్డు అయినట్లు గుర్తించారు. అక్కడ పనిచేస్తున్న డాక్టర్లపై బాధితురాలి బంధువులు ఆ దాడికి పాల్పడ్డారు. సమాచారం అందుకున్న నాలుగవ పట్టణ పోలీసులు ఆస్పత్రికి చేరుకొని విచారించి బాధితురాలి తరుపు బంధువులకు సర్దిచెప్పి ఆందోళన లేకుండా అడ్డుకున్నారు. దీంతో బంధువులు పోలీస్స్టేషన్కు వెళ్లి ఆస్పత్రి సిబ్బంది పై సిసి కెమెరా ఈ విషయం గురించి కేసు నమోదు చేశారు. ఆసుపత్రి సిబ్బందిని శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.