Manchu Lakshmi : పెళ్లి మండపం నుండి పారిపోవాలనుకున్నా.. షాకింగ్ కామెంట్స్ చేసిన లక్ష్మీ మంచు!

Manchu Lakshmi : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూతురు , టాలీవుడ్ నటి , నిర్మాత మంచు లక్ష్మీ ప్రసన్న గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. మంచు లక్ష్మీ నటిగా , నిర్మాతగా , వ్యాఖ్యాతగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. లక్ష్మీ మంచు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ ఉంటుంది.

లక్ష్మి మంచు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను కూడా నెటిజన్ల ముందు ఉంచుతుంది. అప్పుడప్పుడు తన కూతురు ఫొటోస్ ,వీడియోస్ కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటారు .లక్ష్మీ మంచు నటిగా, వ్యాఖ్యాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఈవిడ అనగనగా ఒక ధీరుడు సినిమాలో విలన్ పాత్ర పోషించి తన నటనతో అందరి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. లక్ష్మీ మంచు మిస్సెస్ సుబ్బలక్ష్మి వంటి వెబ్ సీరీస్ లో కూడా నటించి మెప్పించారు .

లాక్ డౌన్ సమయంలో సెలబ్రిటీలు అంతా ఇంటిపట్టునే ఉంటూ ఇంట్లో తాము చేసే పనుల గురించి అభిమానులతో పంచుకున్నారు. ఇదే తరుణంలో లక్ష్మీ మంచు కూడా లాక్ డౌన్ సమయంలో తన పెళ్లినాటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి తన పెళ్లి సమయం నాటి లుక్ అందరికీ పరిచయం చేసింది.

లక్ష్మీ మంచు ఈ సందర్భంగా తన పెళ్లి సమయంలో పెళ్లి కూతురిని మండపంలోకి తీసుకు రమ్మని చెప్పినప్పుడు తను చాలా కంగారు పడిందని ఆ సమయంలో తను పెళ్లి మండపం నుండి పారిపోవటానికి దారి కూడా వెతుక్కుంటున్నాను అని ఈ సందర్భంగా అభిమానులతో షేర్ చేసుకున్నారు. లక్ష్మీ మంచు 2016 లో ఆండి శ్రీనివాస్ తో వివాహం జరిగింది . మంచు లక్ష్మీ సరోగసి పద్దతి ద్వారా ఒక పాపకు జన్మనిచ్చిన సంగతి మనకు తెలిసిందే.