గాంధీ కుటుంబానికి కష్టం వస్తే మనందరికీ కష్టం వచ్చినట్లే: రేవంత్ రెడ్డి

తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఇక మీడియా సమావేశంలో అక్కడ కొన్ని విషయాలు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తోందని అన్నారు. ఆ కుటుంబానికి కష్టం వస్తే మనందరికీ కష్టం వచ్చినట్లే అని అన్నారు. జాతీయ సమగ్రత కోసం యంగ్ ఇండియా ట్రస్టు ద్వారా నేషనల్ హెరాల్డ్ పత్రిక నడుపుతున్నారు అని అన్నారు.

ఈ పత్రికా ఆస్తుల విషయంలో ఎటువంటి లావాదేవీలు జరగనప్పటికీ సోనియా గాంధీ, ఇందిరాగాంధీ లకు ఈడీ నోటీసులు ఇచ్చి భయపెట్టాలని చూస్తోందని అన్నారు. దేశ సమైక్యతను దెబ్బతీసేందుకు బీజేపీ పార్టీ ప్రయత్నిస్తుంది అని విమర్శలు చేశారు. కావున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంత శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.