బాలయ్య వస్తే నాని అవుట్..అందులో నో డౌట్.?

నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రాల్లో “శ్యామ్ సింగ రాయ్” కూడా ఒకటి. టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ తెరకెక్కించిన ఈ సినిమాలో సాయి పల్లవి, కృతి శెట్టి అలాగే ‘ప్రేమమ్’ ఫేమ్ మడోనా సెబాస్టియన్ లు హీరోయిన్స్ గా నటించారు. అయితే పూర్తిగా కొత్త సబ్జెక్టు తో తెరకెక్కించిన ఈ సినిమాని చిత్ర యూనిట్ ఆల్రెడీ క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.

కానీ ఇక్కడే నాని సినిమా ఉండాలా లేదా అన్నది నటసింహం బాలకృష్ణ డిసైడ్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. బాలయ్య మరియు మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కించిన భారీ సినిమా “అఖండ” సినిమా కూడా ఇదే క్రిస్మస్ రేస్ లో ఉండొచ్చని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ బాలయ్య సినిమా కనుక అప్పుడు ఫిక్స్ అయితే నాని సినిమా ఇక తర్వాత ఏడాదికి షిఫ్ట్ అవ్వనుంది అట. అంతే కాకుండా మొదటి మూడు నెలల్లో ఈ సినిమా రిలీజ్ ఉంటుందట. ఇదే ఇప్పుడు ఈ రెండు సినిమాలపై సమాచారం.