Balakrishna: నేను సీఎం జగన్ ను కలవను.. నాకు ఆ అవసరం ఏమాత్రం లేదు.. బాలయ్య షాకింగ్ కామెంట్స్!

Balakrishna: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.అయితే గత కొద్ది రోజుల నుంచి ఏపీ ప్రభుత్వం టికెట్ల విషయంలో ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోకపోవడంతో టాలీవుడ్ పెద్దలు ఏపీ ముఖ్యమంత్రిని కలిసి సినిమా సమస్యల గురించి వివరించారు. ఈ క్రమంలోనే జగన్ సినిమా టిక్కెట్ల రేట్లపై సానుకూలంగా స్పందించారని త్వరలోనే జీవో కూడా విడుదల చేస్తారని మెగాస్టార్ చిరంజీవి మీడియా ముందు వెల్లడించారు.

అయితే ఈ సమావేశానికి నందమూరి బాలకృష్ణ వెళ్ళక పోవడం గమనార్హం. అయితే బాలకృష్ణ ఎందుకు వెళ్ళలేదు అనే విషయాన్ని పలువురు లేవనెత్తారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ఓ కార్యక్రమంలో పాల్గొని ఈ విషయం గురించి మాట్లాడారు. సినీ పెద్దలు ముఖ్యమంత్రితో సమావేశమైన సమయంలో తనకి కూడా ఆహ్వానం పంపించారని అయితే నేను రానని చెప్పినట్లు బాలకృష్ణ తెలియజేశారు.

అదేవిధంగా సీఎం జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కలవను అనే విషయాన్ని కూడా బాలకృష్ణ వెల్లడించారు. నేను నా సినిమా బడ్జెట్ పెంచను నాకు జగన్ ను కలిసే అవసరం లేదు.సినిమా టికెట్ల రేట్లు తక్కువగా ఉన్నప్పుడే తాను నటించిన అఖండ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది అదే ఒక మంచి ఉదాహరణ అందుకే నేను సీఎం జగన్ ని కలవడం నాకు అవసరం లేదంటూ బాలకృష్ణ ఈ సందర్భంగా ముఖ్యమంత్రితో భేటీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి మనకు తెలిసిందే.