ఆర్పీ చెప్పేవన్నీ నిజమైతే జబర్దస్త్ లో ఒక్కరు కూడా ఉండరు.. హైపర్ ఆది కామెంట్స్ వైరల్!

ఇటీవల మల్లెమాల గురించి, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గురించి కిర్రాక్ ఆర్పీ షాకింగ్ కామెంట్స్ చేశాడు. మల్లెమాల వారు అక్కడ పనిచేస్తున్న వారికి సరైన భోజనం కూడా పెట్టకుండా చాలా నీచంగా చూసేవారు అంటూ చెప్పుకొచ్చాడు. శ్యాం ప్రసాద్ రెడ్డి గురించి మాట్లాడుతూ.. ఆయన కనీసం ఎవరిని పట్టించుకోడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం జబర్దస్త్ గురించి శ్యాం ప్రసాద్ రెడ్డి గురించి కిర్రాక్ ఆర్పి చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి. ఈ విషయంపై కొంతమంది జబర్దస్త్ కమెడియన్లు స్పందిస్తున్నారు.

ఈ క్రమంలో హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ కూడా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొని కిరాక్ ఆర్పీ చెప్పిన మాటలపై స్పందించారు. ఈ ఇంటర్వ్యూలో ఆది రాంప్రసాద్ కిర్రాక్ ఆర్పి చెప్పిన విషయాలన్నీ అబద్ధాలే అంటూ కొట్టి పారేశారు. కిర్రాక్ ఆర్పీ చెప్పినవన్నీ నిజాలైతే ఇంతకాలం జబర్దస్త్ లో ఎవరు కొనసాగరు. మేమందరం కూడా ఎన్నో ఏళ్లుగా జబర్దస్త్ లో పని చేస్తున్నాము.అక్కడ ప్రొడక్షన్ వాళ్లు పెట్టే ఫుడ్డు కూడా బాగానే ఉంటుంది అంటూ చెప్పకు వచ్చాడు. ఇక శ్యాం ప్రసాద్ రెడ్డి గురించి కిరాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలను ఆది ఖండించాడు.శ్యాం ప్రసాద్ రెడ్డి ఎంతో మంది జబర్దస్త్ ఆర్టిస్టులకు సహాయం చేశాడు అంటూ ఆది చెప్పుకొచ్చాడు.

జబర్దస్త్ లో పనిచేసే పరదేశి వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగోలేక పోతే కొన్ని నెలల జీతం ముందే ఇచ్చాడు. అయితే జబర్దస్త్ లో పని చేసిన వారు ఎవరూ కూడా పేమెంట్ చెక్ గురించి అడగాల్సిన పని ఉండదు. మన పని అయిపోయిన మరుసటిరోజే మన అకౌంట్ లో డబ్బులు పడతాయి. ఇంతవరకు ఇలా కరెక్ట్ గా పేమెంట్ ఇచ్చే ప్రొడక్షన్ హౌజ్ ని నేను చూడలేదు అంటూ ఆది చెప్పుకొచ్చాడు. అలాగే పంచ్ ప్రసాద్ అనారోగ్యంగా ఉన్న సమయంలో మేము అందరం అతని ట్రీట్మెంట్ కోసం కావలసిన కొంత డబ్బు ఇచ్చాము. కానీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాత్రం తను జీవితాంతం బ్రతకటానికి కావలసిన డబ్బు సంపాదించుకునే మార్గం చెప్పాడు. పంచ్ ప్రసాద్ ఆరోగ్యం కుదుట పడ్డాక శ్రీదేవీ డ్రామా కంపెనీ ప్రతి ఎపిసోడ్ లో, జతిరత్నాలు లో లీడ్ రోల్ చేస్తూ నెలకు మూడున్నర లక్షలు సంపాదిస్తున్నాడు..అంటూ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు పంచ్ ప్రసాద్ కి చేసిన సాయం గురించి చెప్పుకొచ్చ