ఆ సీఎం డైలాగులు చెబుతూ మరోసారి వివాదంలో చిక్కుకున్న హైపర్ ఆది.. ట్రోల్ చేస్తున్న ఫ్యాన్స్!

హైపర్ ఆది నిత్యం బుల్లితెరపై తన కామెడీతో ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా తన నోటి దూల కారణంగా కొన్ని సార్లు పెద్ద ఎత్తున వివాదాలకు తెరలేపుతున్నారు.ఈ క్రమంలోనే హైపర్ ఆది ఇదివరకు ఎన్నో సార్లు నోరు జారుతూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఈయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున తీవ్ర దుమారం రేపుతూ భారీగా ఈయనను ట్రోలింగ్ చేసేవారు. ఈ క్రమంలోనే హైపర్ ఆది బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి.

ఇదిలా ఉండగా తాజాగా ఆయన మరోసారి తన కామెడీ స్కిట్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వివాదంలో చిక్కుకున్నారు. ప్రతి బుధవారం ప్రసారమయ్యే ఢీ డాన్స్ షో కార్యక్రమంలో భాగంగా హైపర్ ఆది సందడి ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ప్రోమోలో భాగంగా ఆది పొలిటికల్ టీమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఇద్దరు కుర్రాళ్ళతో కలిసి హైపర్ ఆది పొలిటికల్ పార్టీకీ ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన పార్టీ పేరు’వేస్తే వెయ్.. లేకపోతే…’ అనే పార్టీని పెట్టినట్లు చెప్పాడు.

ఇక మిగిలిన ఇద్దరు కుర్రాళ్ళు పార్టీ పేరు ఏంటి అని ప్రశ్నించగా అందులో ఒకడు మేము విన్నాం అని చెప్పగా మరొకడు మేము ఉన్నాం అని చెప్పాడు. దీంతో హైపర్ ఆది సరే మేము ఉంటాం అంటూ అక్కడి నుంచి పక్కకు వెళ్లాడు. దీంతో ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈ డైలాగ్స్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఇక ఈ డైలాగులు విన్న వైసీపీ అభిమానులు మాత్రం యధావిధిగా హైపర్ ఆదిని భారీగా ట్రోల్ చేస్తున్నారు.వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సమయంలో వాడిన ఈ డైలాగ్స్ ప్రస్తుతం హైపర్ ఆది తన కామెడీ స్కిట్ లో ఉపయోగించడంతో వైసీపీ ఫ్యాన్స్
హైపర్ ఆది పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.