Crime News:అనుమానంతో భార్యని చంపిన భర్త.. వివాహేతర సంబంధమే కారణమా?

Crime News: సహజంగా భార్య భర్తల మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. ఒక్కోసారి వివాదాలు ముదిరి క్షణికావేశంలో ప్రాణాలు తీసే స్థాయికి దిగజారుతున్నారు. భార్య భర్తలు ఒకరిపై మరొకరు నమ్మకం ఉంటే ఎటువంటి గొడవలు లేకుండా సంసారం సాఫీగా సాగిపోతుంది. కానీ ఈ రోజుల్లో ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకుండా పోయింది.భార్య మీద అనుమానంతో భర్త భార్యని చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాలలోకి వెళితే..ఇరాన్‌లోని అహ్వాజ్‌లో మోనా హీదారీ అనే మహిళ భర్త,మూడేళ్ల కుమారుడితో కలిసి జీవిస్తున్నారు. పెళ్లి జరిగిన తర్వాత కొన్ని రోజులు వీరి సంసారం సజావుగానే సాగింది. ఐతే కొన్ని రోజుల తర్వాత మోనా హిదారీ వేరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలియటం తో తరచూ ఇద్దరు గొడవ పడుతూ ఉండేవారు.భర్తకి తన గురించి నిజం తెలిసిపోయిందని మోనా టర్కీ కి పారిపోయింది. మోనా తండ్రి, భర్త కలిసి ఆమెను వెతికి ఇంటికి తీసుకువచ్చారు.

మోనా ఇంటినుండి పారిపోవడంతో పరువు పోయిందని భావించిన ఆమె భర్త తన తమ్ముడితో కలిసి కిరాతకంగా ఆమెను హత్య చేశారు. ఇంతటితో ఆగకుండా శరీరం నుండి ఆమె తలని వేరు చేసి చేతిలో తలని పట్టుకొని నవ్వుతూ రోడ్డు మీద తిరుగుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావటంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. ఈ దారుణమైన సంఘటన ఇరాక్ ప్రజలందరినీ ఒక్కసారిగా షాక్ కి గురి చేసింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని మహిళా వ్యవహారాల వైస్ ప్రెసిడెంట్ ఎన్సీ ఖాజాలీ ఇరాన్ పార్లమెంట్ ను కోరింది.