Crime News: పెళ్లయిన నెలకే భార్యని చంపిన భర్త … ఎందుకంటే?

Crime News: ఈ రోజుల్లో యువత జీవితం మీద సరైన అవగాహన లేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. చాలామంది యువత ప్రేమ మోజులో పెద్దలను ఎదురించి మరి ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ప్రస్తుత కాలంలో అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్లు ఉంటడం వల్ల అన్య సంస్కృతికి అలవాటు పడి తప్పుదోవ పడుతున్నారు. చాలా మంది అమ్మాయిలు ఈ రోజుల్లో ప్రేమ పేరుతో మోసపోతున్నారు. అమ్మాయిలు మాత్రమే కాకుండా అబ్బాయిలు కూడా అమ్మాయిల ఆకర్షణతో అది ప్రేమ గా భావించి అమ్మాయిల చేతిలో మోసపోతున్నారు.

ప్రేమ ప్రేమ పేరుతో కొంతమంది అబ్బాయిలు అమ్మాయిలను శారీరకంగా వాడుకొని వారిని మోసం చేస్తున్నారు. మరికొందరు ఇంకొక అడుగు ముందుకు వేసి పెళ్లి చేసుకొని కలిసి ఉండలేక విడిపోతున్నారు. కానీ ఇటీవల ప్రకాశం జిల్లాలో ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది. ఇద్దరు ప్రేమించుకొని పెద్దలను ఎదిరించి మరి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. కానీ నెల రోజులకే వారి మధ్య కలహాలతో ఘోరం జరిగిపోయింది.

ప్రకాశం జిల్లా, దర్శి మండలం, పోతవరం లో ఈ దారుణం వెలుగుచూసింది. పావని అనే యువతి గత నెలు18వ తేదీన తాను ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకుంది. కానీ ఇద్దరిమద్య మనస్పర్థల కారణంగా పావని తన పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య పుట్టింటికి వెళ్ళటంతో ఆగ్రహించిన ఆమె భర్త పావని పై కత్తితో దాడి చేశాడు. పావని కుటుంసభ్యులు ఆమెను ఒంగోలు హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆమె భర్త పరారీలో ఉన్నాడు. పెళ్లి అయిన నెలకే ఇలా జరగటం వల్ల వారి మధ్య కలహాలు ఉన్నట్లు బంధుమిత్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.