Crime News: కట్టుకున్న వాడే ఆమె పాలిట కాలయముడయ్యాడు..! ఆస్తి వివాదాలే కారణమా?

Crime News: ప్రస్తుత కాలంలో డబ్బుకు ఉన్న విలువ బంధాలకు బంధుత్వాలకు లేకుండా పోయింది. డబ్బు కోసం ఎంతటి నీచానికైనా దిగజారుతున్నారు. ఆస్తి కోసం కడుపున పుట్టిన వారే తల్లిదండ్రులని కడతేర్చే పరిస్థితి వచ్చింది. ఇటీవల ప్రకాశం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహబంధంతో ఒక్కటైన జంట తుది శ్వాస వరకు తోందుండల్సిన భర్త ఆమె పాలిట మృత్యువు లా మారాడు. ఆస్తి కన్నా తన భార్య ప్రాణం విలువైనది కాదని ఆస్తి కోసం కట్టుకున్న భార్యను కడతేర్చాడు.

వివరాలలోకి వెళితే..ప్రకాశం జిల్లా సంతమాగలూరు మండలంలోని గురిజేపల్లికి చెందిన పాలెపు శ్రీహరిరావు, సుబ్బాయమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. కొంత కాలం తరువాత శ్రీహరిరావు తన అక్క కూతురిని రెండో వివాహం చేసుకున్నాడు. అప్పటినుండి సుబ్బాయమ్మ, శ్రీహరిరావు మద్య చిన్నచిన్న విభేదాలు తలెత్తేవి. ఈ క్రమంలో సుబ్బాయమ్మ తన పేరు పై ఉన్న కొంత ఆస్తిని పెద్ద కుమార్తె కొడుకు పేరు మీద రాయటంతో భర్త, ఆమె చిన్న కుమార్తె ,అల్లుడు ఆమెతో వాదనకు దిగారు.

ఆస్తి తనకు చెందకుండా పెద్ద కుమార్తె కొడుకు పేరు మీద రాయటంతో శ్రీహరి రావు కోపంతో ఎలాగైనా సుబ్బాయమ్మ కడతేర్చాలని నిర్ణయించుకున్నాడు. ఉంది వేసుకున్న ప్లాన్ ప్రకారం ఈనెల 14వ తేదీ రాత్రి ఇంట్లో సుబ్బాయమ్మ నిద్రిస్తున్న సమయంలో ఆమె మెడ చుట్టూ బిగించి చంపేశాడు. అయినప్పటికీ శ్రీహరి రావు కోపం చల్లారక ఆమె మెడలో ఉన్న మంగళసూత్రము తో గట్టిగా గొంతు బిగించి హత్య చేశాడు.ఉదయం తెల్లారిన తర్వాత చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేశారు. తండ్రి మీద అనుమానం ఉన్నట్టు పెద్ద కుమార్తె చెప్పటంతో తమదైన శైలిలో శ్రీహరిరావు పోలీసులు విచారించగా తానే హత్య చేసినట్టు అంగీకరించాడు. దీంతో పోలీసులు శ్రీహరి రావని అరెస్టు చేసి రిమాండ్ కి తరలించారు.