ఆ సినిమాకి ప్రభాస్ కళ్ళు చెదిరే మొత్తం తీసుకున్నాడా.?

ఇప్పుడు ఇండియన్ సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “ఆదిపురుష్” కోసం అందరికీ తెలిసిందే. దీని తోనే ప్రభాస్ డైరెక్ట్ హిందీ చిత్రం చేస్తున్నాడు. అయితే హిందీ మరియు తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కి అప్పట్లో నిర్మాతలు ఖర్చు అయితే వెయ్యి కోట్లు అయినాయి పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

ఇక బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ లెవెల్ కూడా మారడంతో తన రెమ్యునరేషన్ కూడా అమాంతం పెరిగింది. అలా ఇప్పుడు ఆదిపురుష్ కి ఎంత తీసుకుంటున్నాడు అనే దానిపై లేటెస్ట్ గాసిప్ ఒకటో వైరల్ అవుతుంది. దీని ప్రకారం ప్రభాస్ ఆదిపురుష్ కోసం ఏకంగా 150 కోట్లు తీసుకుంటున్నాడని తెలుస్తుంది. ఇది కనుక నిజం అయితే తలైవర్ రజినీ, మరెంతమందో బాలీవుడ్ బడా స్టార్స్ ని ప్రభాస్ దాటేసినట్టే అని చెప్పాలి.