టీటీడీ నిరర్ధక భూముల్ని ఆన్ లైన్ లో వేలానికి ఏపీ ప్రభుత్వం సన్నధం అవుతోన్న సంగతి తెలిసిందే. దీనిపై ప్రతి పక్షాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసాయి. దేవాలయ భూముల్ని ఎలా అమ్ముతారు? ఆ హక్కు ఎవరిచ్చారని..ఈ దోపడిని అడ్డుకుంటామని హెచ్చరించాయి. టీడీపీ, బీజేపీ సహా జనసేన పార్టీలు ఈ విషయంలో కలిసి ముందడుగు వేసే అవకావాలు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి క్రైస్తవుడు కావడంతో హిందువులపై ఈ రకంగా కక్ష గడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. తిరుమల కొండపై ఇప్పటికే క్రైస్తవులు చేసిన యాగిపై పెద్ద ఎత్తున ప్రజలు విమర్శించారు.
తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ హిందుమతాన్ని రెచ్చగొట్టే లా వ్యాఖ్యానించారు. ఇప్పటికే జీవో 39, తిరుమల తిరుపతి దేవస్థానం, సింహాచలం భూముల రక్షణ కోసం పోరాటం చేస్తామని ఆయన చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై మంగళవారం వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా వెంకన్న భక్తులు, బీజేపీ శ్రేణులు, హిందూ సంస్థలు ఉ.10 గంటల నుండి సా.5 గంటల వరకు తమ ఇంటి వద్ద నిరసనదీక్ష చేపట్టాలి అని పిలుపునిచ్చారు. టీటీడీ భూములను వైసీపీ ప్రభుత్వం విక్రయించడం హిందూ మనోభావాలను దారుణంగా అవమానించడమేనని కన్నా అన్నారు.
సోషల్ మీడియాలో మన ప్రొఫైల్ పిక్చర్ మార్చాలని…అందరు డీపీల్లో వెంకన్న స్వామి దర్శనముండాలని అన్నారు. ఇదే హిందూ వ్యతిరేక నిర్ణయంపై పోరాడటానికి నాంది కావాలని పేర్కొన్నారు. అయితే కన్నా ఇలా వ్యాఖ్యానించడంపై పలువురు వైకాపా నేతలు విమర్శలు చేస్తున్నారు. హిందువులను కావాలని రెచ్చగొట్టినట్లు చేస్తున్నట్లు ఉందని.. ఇది బీజేపీ చేస్తున్న రజాకీయ కుట్ర అని… ఈ విధానం బీజేపీ భవిష్యత్ కే ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. వెంటనే కన్నా చేసిని వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.