ఆయన విమర్శల వల్లే నాలో మార్పు వచ్చింది.. చిరు కామెంట్స్ వైరల్?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడు మెగాస్టార్ చిరంజీవి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమైన మెగాస్టార్ తిరిగి ఇండస్ట్రీలోకీ రీ ఎంట్రీ ఇస్తూ నేటి తరం హీరోలకు పోటీగా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వరుస సినిమా షూటింగులకు బిజీగా ఉన్నారు. ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మెగాస్టార్ గా గుర్తింపు పొందిన ఈయన సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఇకపోతే గత రెండు రోజుల క్రితం ప్రముఖ జర్నలిస్ట్ గుడిపూడి శ్రీహరి అనారోగ్య కారణంతో మృతి చెందిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన మరణం పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఆయన ఆత్మకు శాంతి కలిగించాలని ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించడమే కాకుండా ఆయనతో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న అనుబంధం గురించి కూడా తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ స్పందిస్తూ గుడిపూడి శ్రీహరి ఎంతో న్నో చిత్రాలపై ఆయన రాసిన ఆరోగ్యకరమైన విమర్శలు.. నటుడిగా నన్నుమెరుగ్గా మలుచుకోవడానికి నాలో మార్పు రావడానికి ఆయనే కారణమని మెగాస్టార్ చిరంజీవి ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్ట్, సినీ విమర్శకులు గుడిపూడి శ్రీహరి గురించి వెల్లడించారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈయన సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్ వంటి సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు