Mithun Reddy: లిక్కర్ కేసులో మిధున్ రెడ్డికి నోటీసులు… కీలక ఆదేశాలు జారీచేసిన హైకోర్టు!

Mithun Reddy: వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వ హయామంలో పెద్ద ఎత్తున లిక్కర్ స్కామ్ జరిగిందని కొన్ని వేల కోట్లు అవినీతి జరిగిందంటూ కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సీట్ విచారణ చేపడుతోంది. అయితే ఈ స్కాం దర్యాప్తులో భాగంగా కసిరెడ్డికి అధికారులు నోటీసులు జారీ చేయడమే కాకుండా ఆయన ఇంట్లో దాదాపు 15 చోట్ల సోదాలు నిర్వహించగా కీలక ఆధారాలు లభ్యమయ్యాయనీ తెలుస్తోంది.

ఈ క్రమంలోనే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని సైతం విచారణకు రావాలి అంటూ అధికారులు నాలుగు సార్లు నోటీసులు పంపినప్పటికీ ఇప్పటివరకు ఆయన నుంచి ఏ విధమైనటువంటి సమాధానం రాలేదు ఈ క్రమంలోనే మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి కూడా సీట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. 18వ తేదీ ఉదయం 11 గంటలకు ఈయన విచారణకు రావాలని కోరగా ఆయన మాత్రం 17వ తేదీ విచారణకు వస్తున్నానని తెలిపారు కాని చివరి నిమిషంలో మినహాయింపు కోరారు.

ఇలాంటి తరుణంలోనే మరో ఎంపీ మిథున్ రెడ్డికి సైతం ఆదేశాలు జారీ చేస్తూ ఈనెల 18వ తేదీ విజయవాడలోని సిపి కార్యాలయానికి విచారణకు రావాలని సూచించారు ఇలాంటి తరుణంలోనే మిథున్ రెడ్డి హైకోర్టుకు వెళ్లారు.అంతుకు ముందు కూడా ఈ కేసులో తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని ఎంపీ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో, హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

ఈ నేపథ్యంలో రేపు విచారణకు హాజరుకావాలని ఏపీ సిట్ నోటీసులు జారీ చేయగా… ఆయన ఈరోజు హైకోర్టును ఆశ్రయించారు.హైకోర్టులో విచారణ జరిగింది. లాయర్ల సమక్షంలో మద్యం కేసుపై సిట్‌ విచారణ చేయాలని, విచారణను రికార్డు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఎంపీ మిథున్‌రెడ్డి పిటిషన్లో కోరారు. విచారణను రికార్డు చేసే అంశాన్ని పరిశీలించాలని సీఐడీకి హైకోర్టు ఆదేశించింది.