Crime News: మొదటి పెళ్లి సంగతి దాచి మరొకరితో పెళ్లి.. భార్య విడాకులు కోరగా దారుణం…!

Crime News: ప్రస్తుత కాలంలో చాలా మంది పురుషులు తమకు పెళ్లి అయిన సంగతి దాచి వేరే మహిళల తో అనిత్యం గా ఉంటూ వారిని కూడా మోసం చేస్తున్నారు. తాజాగా కర్ణాటకలో ఇటువంటి సంఘటన చోటు చేసుకుంది. మొదటి వివాహం గురించి దాచిపెట్టి వేరొక మహిళ తో సన్నిహితంగా ఉంటూ ఆమెను కూడా వివాహం చేసుకొని ఒక బిడ్డ పుట్టిన తర్వాత తన బండారం బయటపడింది. బట్ట అసలు స్వరూపం తెలుసుకున్న మహిళ తన నుండి విడాకులు కోరగా భర్త దారుణానికి ఒడిగట్టాడు.

వివరాల్లోకి వెళితే..కర్ణాటకలోని గడగ్ జిల్లా హుబ్బలి లో నివాసం ఉంటున్న మహ్మద్ ఎజాజ్ షిరూర్‌ అనే వ్యక్తిని అపూర్య పురాణిక్‌ అనే యువతి ప్రేమించి తన పేరు మార్చుకుని మరీ వివాహం చేసుకుంది. ఇదిలా ఉండగా మహమ్మద్ ఏజాజ్ షిరూర్ కి ఇంతకమునుపే వివాహం జరిగి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. తన మన మొదటి పెళ్లి విషయం దాచి పెట్టి తాను చదువుకుంటున్నానని డబ్బు సంపాదన కోసం పార్ట్‌ టైం ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాని మాయమాటలు చెప్పి అపూర్వని నమ్మించాడు.

మహమ్మద్ మాయలు పడిన అపూర్వ తనను నమ్మి ఏమి పేరు మార్చుకొని మరి అతనిని పెళ్లి చేసుకుంది. ఇద్దరి దంపతులకు ఒక పాప కూడా ఉంది. ఐతే భర్త గురించి అసలు నిజం తెలుసుకున్న అపూర్వ తన నుండి విడిపోవాలని నిర్ణయించుకుంది. కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది. మన గురించి అసలు నిజం బయటపడి అపూర్వ దూరంగా పెట్టడంతో ఆమె మీద కక్ష పెంచుకున్న భర్త ఎలాగైన తనని అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమం లో ఆమె స్కూటీ నేర్చుకుంటుండగా కొడవలితో కిరాతకంగా దాడి చేశాడు. వెంటనే స్థానికులు గమనించి ఆమెను ఆసుపత్రికి తరలించి మంచి చికిత్స అందిస్తున్నారు. నా కుర్ర తండా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ఈ ఘటన నుండి ప్రాణాలతో బయటపడిన అపూర్వ చేసిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ వీడియోలో ధర్మానికి విరుద్ధంగా వివాహం చేసుకొని కష్టాలపాలు కావద్దు అంటూ చెప్పుకొచ్చింది.