AP: వాలంటీర్ వ్యవస్థనే మమ్మల్ని ఓడించింది…. వారిది గెజిటెడ్ ఉద్యోగమా?గుడివాడ అమర్నాథ్

AP: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది అవుతుంది అయితే ఈ ఏడాది కాలంలో వైసీపీ ఓటమికి గల కారణాలు ఏంటి అనే వెతకడంలోనే వైసిపి నేతలు ఉన్నారని చెప్పాలి ఈ క్రమంలోనే వైసిపి ఓటమికి ఎన్నో కారణాలను బయటపెట్టారు తాజాగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తమ పార్టీ ఓటమి గల కారణాలను తెలియజేశారు.

గుడివాడ అమర్నాథ్ ఐటి శాఖ మంత్రిగా పనిచేశారు అయితే ప్రస్తుతం ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే అయితే వైయస్ జగన్మోహన్ రెడ్డి గుడివాడ అమర్నాథ్ కు అనకాపల్లి అధ్యక్షుడిగా బాధ్యతలను అప్పచెప్పారు. ఇలా అనకాపల్లి బాధ్యతలు తీసుకున్న తర్వాత ఈయన వైసిపి పార్టీ ఓటమి గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.

మా పార్టీ ఓడిపోవడానికి కారణం మేము తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థనే అని ఈయన తెలిపారు. వారే ఎన్నికల్లో తమ పార్టీ ఓడేందుకు కారణమయ్యారని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వంలో ప్రజలకు.. వాలంటీర్లు.. సచివాలయ సిబ్బంది ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలను అందించాము కానీ మేము ఓడిపోవడానికి కూడా వాలంటీర్లే కారణమయ్యారని తెలిపారు.

ఎన్నికలకు ముందు వాలంటీర్లు రాజీనామా చేస్తే తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వాలంటీర్లను విధులలోకి తీసుకుంటామని చెప్పిన ఎవరూ కూడా ముందుకు రాలేదు.కొంతమంది తమది గెజిటెడ్ ఉద్యోగం అన్నట్లుగా వ్యవహరించారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే వాలంటీర్లను తీసేస్తారని చెప్పినా వాలంటీర్లు వినలేదని అమర్నాథ్ వెల్లడించారు ఇలా తమ ఓటమికి వాలంటీర్లు కూడా కారణమే అంటూ ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.