రాజస్థాన్, మద్యప్రదేశ్ రాష్ర్టాల్లో పంటల్ని మింగేసిన మిడుతల దండు గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆ రెండు రాష్ర్టాల రైతులను మిడుతల దండు కారణంగా తీవ్ర నష్టాల్లో పడ్డారు. అక్కడి ప్రభుత్వాలు రకరకాల హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. పాకిస్థాన్ నుంచి ఇండియా బోర్డర్ లో అడుగు పెట్టిన ఈ దండు ఇప్పుడు భారత్ పై పగతీర్చుకుంటుంది. ఇప్పుడా మిడుతల ముప్పు తెలుగు రాష్ర్టాలకు పొంచి ఉందా? అంటే అవుననే సమాచారం అందుతోంది. సరిగ్గా తెలంగాణకి 400 కిలోమీటర్ల దూరంలో దండు మాటేసి ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. మరో రెండు రోజుల్లో ముందుగా తెలంగాణలో దండెత్తడం ఖాయమని అంచనా వేస్తున్నారు.
దీనిలో భాగంగా క్రిమి సంహారక మందులు రైతులు సిద్దంగా ఉంచుకోవాలని, పంటపొలాల్లో మైకులను ఏర్పాటు చేసుకోవాలని, అదే విధంగా రంగు రంగుల పట్టాలు గాల్లో ఎగిరేలా పంట పొల్లాల్లో కట్టాలని సూచించారు. వాటిని భయపెట్టడానికి పెద్ద పెద్ద శభ్దాలతో పాటు, రంగు బట్టలేసుకుని రంగంలోకి దిగాలని వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరించారు. వాటికి పంటతో పనిలేదని, గుంపుగా పంట మీద పడ్డాయంటే పంట మొదలు ముక్క కూడా మిగలకుండా మింగేస్తున్నాయని తెలిపారు. కాబట్టి ప్రభుత్వం అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచనలు వస్తున్నాయి. ఏమాత్రం యేమర పాటుగా ఉన్నా? నష్టం ఊహించని విధంగా ఉంటుందని హెచ్చరించారు.
దానికి తగ్గట్టు అన్ని రకాలుగా రైతులు సహా ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి సిద్దంగా ఉండాలని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు తెలుగు రాష్ర్టాల్లో పెద్దగా పంటలేవి ఉండవు. అన్ని రకాల పంటలు కోతలు పూర్తిచేసుకుని ఇంటికి చేరుకున్నవేనని. అంతంగా భయపడాల్సిన సన్నివేశమైతే లేదని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మిడుతల దండు పంటలు వేసిన తర్వాత మళ్లీ తిరిగొస్తే? పరిస్థితి ఏంటి అన్న దానిపై ప్రభుత్వాలు ఇప్పటి నుంచే సీరియస్ గా ఆలోచన చేస్తే మంచిదని సూచిస్తున్నారు. ఇటీవలే తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఓ కాంగ్రెస్ నేత మిడుతల దండు నుంచి తెలంగాణ రైతుల్ని రక్షించాలని కోరారు. రైతులు…పంటలు గురించి బాగా అనుభవజ్ఞుడిలా మాట్లాడిన కేసీఆర్ మిడుతల దండుకు ఓ పరిష్కారం చూపించాలని , ఆనమ్మకం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేసారు.
