Crime News: కన్న కూతురిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన వాడే క్రూరంగా ప్రవర్తిస్తే..!

Crime News: ఈ రోజుల్లో చాలా మంది పురుషులు వారి కామ వాంఛలు తీర్చుకోవటానికి చిన్న, పెద్ద అని తేడా లేకుండా ఆడది కనిపిస్తే చాలు వారి మీద అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వావి వరుసలు మరిచి కన్న తల్లి, కూతురు అని తేడా లేకుండా చాలా క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. దేశంలో పుట్టిన చిన్న పిల్లలు నుండి ముసలి వారీ వరకు ఎవరికీ రక్షణ లేకుండా పోయింది. వీటన్నిక అడ్డు కట్ట వేయటానికి ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు అమలు చేసినప్పటికీ ఇటువంటి అఘాయిత్యాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇటువంటి బాధాకరమైన సంఘటన ఒకటి చోటు చేసుకుంది.

మన దేశం కూతురు పుట్టింది అంటే చాలు వారిని ఇంటి మహాలక్ష్మి గా భావించి అల్లారుముద్దుగా పెంచి వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. కానీ తండ్రి అన్న పదానికి కలంకం వచ్చేలా ప్రవర్తించాడు ఓ నీచుడు. తన తమ్ముడితో కలిసి కన్నకూతురిపైనే అత్యాచారం చేయటం మొదలు పెట్టాడు. వివరాలలోకి వెళితే..ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం మండలం నీలాద్రిపురం గ్రామానికి చెందిన వ్యక్తికి గంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన మహిళతో 15 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలకు ఒక మగపిల్లవాడు. ఈ దంపతుల మధ్య మనస్పర్థల కారణంగా భార్య అతనిని వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది.పెద్ద కూతురు కుమారుడు తన తండ్రి వద్దే ఉంటూ జీవనం సాగిస్తున్నారు.

తల్లి లేని లోటును కూడా తీర్చాల్సిన వాడు సమయానికి తిండి పెట్టీ తల్లిలా చూసుకుంటున్న తన కూతురి మీదే కన్నేశాడు. తన తమ్ముడితో కలిసి కన్న కూతురిపై అత్యాచారం చేయటం మొదలు పెట్టారు. సంవత్స కాలంగా తను అనుభవిస్తున్న వేదన తన తల్లితో చెప్పుకున్న ఎటువంటి ప్రయోజనం లేక తన బాధ వర్ణనాతీతంగా మారింది. తన సహనం నశించి ఏమి చేయాలో పాలుపోక మృగాళ్ల ప్రవర్తించి కన్న కూతురి మీద అత్యాచారం తండ్రి, బాబాయ్ మీద గ్రామ మహిళా పోలీస్ చొరవతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు బాధితురాలి తండ్రి, బాబాయిపై పోక్సో చట్టం కింద అరెస్ట్ చేశారు.బాలికకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు చదువుకునేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ ఆదేశాల జారీ చేసింది.