Crime News: కామంతో కన్న కూతురిని కాటేసిన తండ్రి..20 ఏళ్లు జైలు శిక్ష విధించిన కోర్టు..!

Crime News:దేశంలో బాలికల మీద అత్యాచారాలు నిత్యకృత్యంగా మారాయి. ఎక్కడ చూసిన అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అనుబంధాలను, మానవసంబంధాలను మరిచి కూతురిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న తండ్రులు అత్యాచారాలు చేస్తున్నారు. కామపిశాచుల్లా మారి కూతురి జీవితాన్ని చిద్రం చేస్తున్నారు. సభ్య సమాజం తలదించుకునే విధంగా కన్న కూతురిని రేప్ చేశాడు ఒక కామాంధుడు. కన్న కూతురి పైనే దారుణానికి ఒడిగట్టిన ఆ కామాంధుడికి కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్ష వేసింది.

తెలంగాణ లోని నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలానికి చెందిన దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. తల్లి పిల్లల్ని ఇంట్లోనే వదిలి పక్క ఊరిలో జరుగుతున్న ఫంక్షన్ కి వెళ్ళింది. మద్యం మత్తులో ఇంటికి వచ్చిన తండ్రి 13 ఏళ్ల తన పెద్ద కుతురిని అత్యాచారం చేశాడు. ఆపై అత్యాచార ఘటన ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. కూతురు గర్భం దాల్చడంతో ఈ విషయం బయటకు రాకుండా గర్భ స్రావ మాత్రలు వేయించాడు. అనంతరం 2019 మార్చి 28న భార్యను కొట్టి మరోసారి కూతురుని తన వద్దకు పంపించాలంటూ బెదిరించాడు.

భర్త చేసిన వికృత చేష్టలతో విసుగుచెందిన భార్య రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసుకుని పోలీసులు బాధితుడిని అదుపులోకి తీసుకున్నారు. కూతురుపై తను చేసిన ఆకృత్యాలకు సీరియస్ గా పరిగణించింది కోర్టు, ఆ కీచక తండ్రికి కఠిన శిక్ష విధించింది. కేసుకు సంబంధించిన ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయస్థానం నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగారశిక్ష మరియు వెయ్యి రూపాయల జరిమానా విధించారు. న్యాయ సేవ సంస్థ ద్వారా సదరు బాలిక 1.5 లక్షలు పరిహారం కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.