అన‌సూయ‌తో కొత్త ప్రాజెక్ట్ మొద‌లు పెట్టిన నిహారిక‌.. లాంఛ‌నంగా ప్రారంభం

ముద్ద‌పప్పు ఆవ‌కాయ అనే వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన మెగాడాట‌ర్ నిహారిక ఒక మ‌న‌సు చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా నిరాశ‌ప‌రచిన కూడా ఆ త‌ర్వాత ప‌లు ప్రాజెక్ట్స్ చేసింది. ఏ సినిమా కూడా నిహారిక‌కు ప్ర‌త్యేక గుర్తింపు తీసుకురాలేదు. చిరంజీవి న‌టించిన సైరా అనే చిత్రంలో గెస్ట్ రోల్ పోషించిన నిహా ఇందులో ఆక‌ట్టుకుంది. అయితే ముందు నుండి ఎక్కువ‌గా వెబ్ సిరీస్‌ల‌పై ఆస‌క్తి చూపుతూ వ‌స్తున్న నిహారిక తాజాగా మ‌రో వెబ్ సిరీస్‌ని మొదలు పెట్టింది. దీనికి సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాలు ఈ రోజు హైద‌రాబాద్‌లో జ‌రిగాయి.

నిహారిక ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌లో యూ ట్యూబర్‌ నిఖిల్‌ విజయేంద్ర, ప్రముఖ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.రాయుడు చిత్రాల బ్యానర్‌పై భాను రాయుడు దర్శక నిర్మాతగా ఈ వెబ్‌సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ముందుగా ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాల‌ను జొన్న‌ల‌గ‌డ్డ‌, చైత‌న్య‌లు ప్రారంభించ‌గా, మాస్ డైరెక్ట‌ర్ వివి వినాయ‌క్, ప్ర‌ముఖ రైట‌ర్ విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ ఇద్ద‌రు క‌లిసి ద‌ర్శ‌క నిర్మాత భాను రాయుడుకి స్క్రిప్ట్ అందించారు. యంగ్‌ ప్రొడ్యూసర్‌ హర్షిత్‌ రెడ్డి బ్యానర్‌ లోగోను ఆవిష్కరించారు.

డిజిట‌ల్ రంగం రోజురోజుకు మ‌రింత‌గా అభివృద్ది చెందుతున్న నేప‌థ్యంలో మా రాయుడు చిత్రాలు బ్యానర్‌పై ఫాంటసీ డ్రామా జోనర్‌లో వెబ్‌ సిరీస్‌ తెరకెక్కించడానికి కథను సిద్ధం చేశాం అని భాను రాయుడు అన్నారు.నిహారిక అయితే త‌మ క‌థ‌కు న్యాయం చేస్తార‌ని భావించి ఆమెను ఈ ప్రాజెక్ట్‌కు తీసుకున్నాం. అతి త్వ‌ర‌లోనే మా వెబ్ సిరీస్ షూటింగ్ ప్రారంభం కానుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు .