Crime News: మందుబాబుల బీభత్సం.. ప్రియుడిని చెట్టుకు కట్టేసి యువతిపై లైంగిక దాడి..!

Crime News: సమాజంలో రోజు రోజుకి మహిళల మీద అత్యాచారాలు పెరిగిపోతున్నాయి . మహిళ ఒంటరిగా బయటికి వెళ్లాలంటే భయపడే పరిస్తితి ఏర్పడుతోంది. కొందరు దుర్మార్గులు కామవాంఛ తీర్చుకోవడానికి మహిళల్ని, చిన్నపిల్లల్ని ఉసురు తీస్తున్నారు. మహిళ ఒంటరిగా కనిపిస్తే చాలు దాడి చేయటానికి కామాంధులు కాచుకొని ఉంటారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సంఘటన తీవ్ర కలకలం సృష్టిస్తోంది.

వివరాలలోకి వెళితే… సరదాగా బీచ్ కి వచ్చిన ప్రేమజంటపై మందుబాబులు దారుణానికి ఒడిగట్టారు.
ఈ దారుణ ఘటన కృష్ణా జిల్లా బందరు మండలం పల్లిపాలెం బీచ్ వద్ద చోటు చేసుకుంది. తాజాగా ఇద్దరు ప్రేమికులు సాయంత్రం సరదాగా గడపటానికి పల్లిపాలెం బీచ్ కి వెళ్ళారు. అయితే అక్కడే బీచ్ లో మందు తాగుతున్న ఇద్దరు యువకులు ఈ ప్రేమ జంటను గమనించారు.

మద్యం మత్తులో యువకులు ఇద్దరు ప్రేమ జంట మీద దాడి చేసి దారుణానికి పాల్పడ్డారు. ప్రేమికుడిని చెట్టుకు కట్టేసి యువతినీ హత్యాచారం చేశారు. వారి నుండి తప్పించుకున్న ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించి జరిగిన విషయం చెప్పారు. బాధితులు చెప్పిన వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిగా ఉన్న నాగబాబును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరొక నిందితుడు పరారీలో ఉండగా అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.