Bidhu Madhavi: బిగ్ బాస్ టైటిల్ విన్నర్ బిందూ మాధవి ఎంత డబ్బు దక్కిందో తెలుసా..?

Bidhu Madhavi: ఓటీటీలో ప్రసారమైన బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ మంచి ప్రేక్షకాదరణ పొందింది. ఈ నాన్ స్టాప్ సీజన్ లో బిగ్ బాస్ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఒక లేడీ కంటెస్టెంట్ టైటిల్ దక్కించుకుంది. బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ లో టైటిల్ గెలుచుకున్న బిందుమాధవి ఈ సరికొత్త రికార్డును సృష్టించింది. ఈ రియాలిటీ షో మొదలైన నాటి నుండి చివరి వరకు బిందుమాధవి టైటిల్ కోసం గట్టి పోరాటం చేసింది. ఈమె బిగ్ బాస్ హౌస్ లో ఆడే ఆట తీరును చూసి అందరూ ఆడపులి అంటూ బిరుదిచ్చారు.

అయితే ఈ రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసే కంటెస్టెంట్ లకు ఇండస్ట్రీలో వారికున్న పాపులారిటీ ఆధారంగా రెమ్యునరేషన్ ఉంటుంది. బిందు మాధవి చివరిదాకా బిగ్ బాస్ హౌస్ లో ఉంది టైటిల్ గెలవడంతో ఆమె రెమ్యూనరేషన్ తో పాటు టైటిల్ గెలిచినందుకు 50 లక్షల రూపాయలు కూడా ఆమెకి దక్కుతుంది . అయితే గ్రాండ్ ఫినాలే రోజున పోటీలో ఉన్న ఏడు మంది కంటెస్టెంట్ ల లో ముందు ముగ్గురు హౌజ్ నుండి బయటికి రాగా అరియానా 10 లక్షలు తీసుకొని బయటికి వచ్చింది.

ఈ క్రమంలో బిందూకి రెమ్యూనరేషన్ తో పాటు 40 లక్షలు మాత్రమే దక్కింది. అయితే ఈ 40 లక్షలలో కూడా 32 శాతం ట్యాక్స్ గా చెల్లించాల్సి ఉంటుంది. టాక్స్ చెల్లించగా బిందూకి కేవలం దాదాపు 28 లక్షల రూపాయలు మాత్రమే దక్కాయి. దీంతో ఆమె అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని రోజులు కష్టపడి టైటిల్ గెలుచుకుంటే ఇలా తక్కువ డబ్బులు ఇవ్వటం చాలా అన్యాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.