తెలంగాణాలో రాజకీయ భూకంపం : షర్మిల పార్టీ లో జేరబోతోన్న టాప్ లీడర్స్ ఎవరెవరో తెలుసా ?

ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి జగన్ తనకు అన్యాయం చేసారు కాబట్టి తాను తెలంగాణాలో పార్టీ పెడుతున్నా అని వైఎస్ షర్మిల ఇచ్చిన ఒక సంకేతం రాజకీయ వర్గాల్లో సంచలనం అయింది. నిన్న ఆమె ప్రసంగం తర్వాత చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేసారు కూడా. ఇక ఇదిలా ఉంటే నిన్న ఆమె లోటస్ పాండ్ లో వరుస సమావేశాలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె కొన్ని కీలక వ్యాఖ్యలు చేసారు. తాజాగా ఆమె మరోమారు కొన్ని వ్యాఖ్యలు చేసారు. కొత్త పార్టీ కార్యాచరణ,సమ్మేళనాలు నిర్వహణ పై షర్మిల సమావేశం ముగిసింది. ఈ నెల 20 న ఖమ్మం జిల్లా వైఎస్సార్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించే యోచనలో ఆమె ఉన్నారు.

హైదరాబాద్ లో పార్టీకి కొత్తగా కార్యాలయం చూడాలని నిర్ణయం తీసుకున్నారు. పార్టీ లో చేరికల పై పూర్తి స్థాయి పరిశీలన కూడా చేసారు. కొత్త పార్టీ కొత్త వారికి అవకాశం ఇచ్చేలా చూడాలి అని పేర్కొన్నారు.