శృతి హాసన్ మీద ప్రశంశలు కురిపించిన డైరక్టర్.. వైరల్ అవుతున్న పోస్ట్…!

ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురిగా మాత్రమే కాకుండా హీరోయిన్ గా శృతిహాసన్ తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. పవన్ కళ్యాణ్ సరసన గబ్బర్ సింగ్ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది. అందం, అభినయంతో ఈ అమ్మడు ఇటు తెలుగు అటు తమిళ ప్రేక్షకులని బాగా అలరించింది. తెలుగులో శృతి హాసన్ నటించిన గబ్బర్ సింగ్, ఓ మై ఫ్రెండ్, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు వంటి సినిమాలలో టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించింది. తన ప్రియుడి కోసం కొంతకాలం సినిమాలకి దూరంగా ఉంటూ విదేశాలలో స్టేజ్ పెర్ఫార్మెన్స్ లు కూడా ఇచ్చింది.

శ్రుతి హాసన్ ఒక పాపులర్ హీరోయిన్ మాత్రమే కాకుండ ఒక మంచి సింగర్ కూడా. ఇప్పటికే ఈమె నటించిన సినిమాలలో ఎన్నో పాటలు కూడా పాడింది. ఒక అవార్డ్ ఫంక్షన్ లో తన తండ్రితో కలిసి స్టేజ్ మీద పాట పడి అందరి ప్రశంశలు అందుకుంది. కొంత కాలం సినిమాలకి దూరంగా ఉన్న శ్రుతి హాసన్ రవితేజ హీరోగా నటించిన క్రాక్ సినిమా ద్వార రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వటంతో వరుస సినిమాలలో నటిచే అవకాశాలు వచ్చాయి. ప్రస్తుతం ఈ అమ్మడు బాలయ్య బాబు కి జోడీగా నటించనుంది.

ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో శ్రుతిహాసన్ కథానాయిక పాత్రలో కనిపించనుంది. అఖండ సినిమా ద్వారా బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరొక యాక్షన్ సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన ఈ మూవీ ఫస్ట్ గ్లింప్స్‏ ప్రేక్షకులని ఆకట్టుకొని సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేసింది . ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా నటిస్తున్న శ్రుతి హాసన్ తాజాగా ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యింది. ఈ విషయాన్ని డైరెక్టర్ గోపిచంద్ మలినేని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. శ్రుతి హాసన్ తో దిగిన ఫోటో ట్విట్టర్ లో షేర్ చేస్తూ.. మోస్ట్ టాలెంటెడ్, ఫెవరేట్ పర్సన్ అంటూ శృతి హాసన్ మీద ప్రశంశలు కురిపించాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.