Divorce: ధనుష్-ఐశ్వర్య విడాకులు.. షాక్ లో కోలీవుడ్ ఇండస్ట్రీ..!

Divorce: రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆవిడ హీరో ధనుష్ భార్యగా మాత్రమే కాకుండా.. దర్శకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరి విడాకులు ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట సడన్ గా విడాకులు తీసుకోవడంతో అభిమానులందరూ షాక్ కి గురయ్యారు. 2004 నవంబర్ 18వ తేదీన వీరిద్దరూ వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరికి యాత్రా రాజా ,లింగరాజ అను ఇద్దరు కుమారులు ఉన్నారు. 2011 సంవత్సరంలో ధనుష్ నటించిన”3″ ఐశ్వర్య దర్శకత్వం వహించింది. ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట తాజాగా విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు.

ధనుష్ పాన్ ఇండియా లెవెల్లో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. చేతి నిండా సినిమాలతో ఎప్పుడు బిజీ గా ఉండే ధనుష్ పలు భాషలలో హీరోగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఐశ్వర్య రజనీకాంత్ కుమార్తెగా, హీరో ధనుష్ భార్యగా మాత్రమే కాకుండా దర్శకురాలిగా తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకుంది. తాజాగా వీరిద్దరి మధ్య ఒక హీరోయిన్ వల్ల మనస్పర్ధలు మొదలయ్యాయని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి మధ్య ఉన్న మనస్పర్థల కారణంగా నిన్న రాత్రి 11:00 సమయంలో వారిద్దరూ విడిపోనున్నటు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. 18 సంవత్సరాలు ఎంతో అన్యోన్యంగా కలిసి ఉన్న ఈ జంట భవిష్యత్తు కోసం ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ఇలా దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నామన్నారు.

టాలీవుడ్లో బెస్ట్ కపుల్ గా ఉన్న సమంత-నాగ చైతన్య దారిలో ఐశ్వర్య- ధనుష్ పయనించడం పై కోలీవుడ్లో తీర అనుమానాలు రేకెత్తుతున్నాయి. భవిష్యత్తులో ఐశ్వర్య ధనుష్ వారి మధ్య ఉన్న విభేదాలను తొలగించుకుని మునుపటిలా వారిద్దరూ అన్యోన్యంగా ఉండాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్ చిన్న కుమార్తె కూడా మొదటి వివాహాన్ని రద్దు చేసుకొని మరలా వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. ఇప్పుడు ఐశ్వర్య కూడా ధనుష్ తో తన వివాహబంధానికి ,18 సంవత్సరాల వారి అన్యోన్యతకు విడాకుల రూపంలో స్వస్తి చెబుతోంది. ఏది ఏమైనా ఇలా వారిద్దరూ విడాకులు తీసుకోవడం అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.