మళ్లీ ఒక్కటి కాబోతున్న దీప్తి సునయన,షణ్ముఖ్ జశ్వంత్.. అసలేం జరిగిందంటే?

యూట్యూబ్ స్టార్స్ గాఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లకముందు పీకల్లోతు ప్రేమలో ఉన్న ఈ జంట కలిసి ఎన్నో యూట్యూబ్ వీడియోలు వెబ్ సిరీస్ లో నటించారు. ఈ విధంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న దీప్తి సునైనా షణ్ముఖ్ జస్వంత్ ను బిగ్ బాస్ సీజన్ 5 విడదీసిందని చెప్పాలి. బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ జస్వంత్ సిరితో ఎంతో చనువుగా ఉండటం వల్ల వీరిద్దరి మధ్య బేధాభిప్రాయాలు వచ్చి విడిపోయారు.

ఈ విధంగా ఈ ఏడాది న్యూ ఇయర్ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా దీప్తి సునైనా షణ్ముఖ్ జస్వంత్ కి బ్రేకప్ చెప్పింది.ఈ క్రమంలోనే షణ్ముఖ్ జస్వంత్ కూడా దీప్తి సునయనకు దూరంగా ఉంటున్నారు. అయితే ఎప్పటికైనా వీరిద్దరు కలుస్తారని అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. అయితే తాజాగా వీరిద్దరు కలవబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీరిద్దరూ వారి ప్రేమ విషయం గురించి కలవలేదు. మరి వీరిద్దరూ ఎక్కడ కలవబోతున్నారు ఏంటి అనే విషయానికి వస్తే…

బిగ్ బాస్ కార్యక్రమం కోసం వీరిద్దరూ మళ్లీ ఒకటి కాబోతున్నారు. బిగ్ బాస్ కార్యక్రమం గ్రాండ్ ఫినాలేకి రావడంతో షణ్ముఖ్ జస్వంత్ దీప్తి సునైనా ఇద్దరూ కలిసి కంటెస్టెంట్ అఖిల్ కి మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే తనని గెలిపించాలి అంటూ వీరిద్దరూ తనకు సపోర్ట్ చేస్తూ పోస్టులు పెట్టారు.దీంతో ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెద్ద ఎత్తున నెటిజన్లు వీరిద్దరూ తిరిగి కలిసారా అందుకే ఇద్దరూ ఒకరికి సపోర్ట్ చేస్తున్నారా అంటూ పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అయితే వీరిద్దరూ ఎవరికి వారే కంటెస్టెంట్ అఖిల్ కు మద్దతు తెలుపుతున్నట్లు సమాచారం.