Crime News: తల్లి చేసిన పనికి స్నేహితులతో కలిసి హతమార్చిన కూతురు…!

Crime News: తల్లిదండ్రులు పిల్లల్ని కని, పెంచి వారిని మంచి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని ఎన్నో కలలు కంటుంటారు.కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల మాటలు పెడచెవిన పెట్టి చనిపోతుంటే మరికొంత మంది తల్లిదండ్రులు పిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారు. ఇటీవల చెన్నైలో ఇటువంటి సంఘటన కారణంగా ఒక తల్లి కూతురు చేతిలో ప్రాణాలు కోల్పోయింది.

వివరాల్లోకి వెళితే… మునియ అనే మహిళ భర్త వదిలేయడంతో ఇళ్లల్లో పని చేసుకుంటూ తన ముగ్గురు పిల్లల్ని పెంచి పోషిస్తోంది. అయితే సులభంగా డబ్బు సంపాదించాలని మునియలక్ష్మి చేసిన పనికి చివరకు తన ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. సులభంగా డబ్బు సంపాదించడం కోసం తన కూతురిని వ్యభిచార కూపంలోకి దించే కూతురి శరీరంతో వ్యాపారం చేయాలని నిర్ణయించుకుంది. కానీ తల్లి చెప్పిన మాటలు అస్సలు ఇష్టం లేని కూతురు ఈ విషయం గురించి తరచూ తన తల్లితో గొడవ పడేది.

తన తల్లి బ్రతికుంటే ఎప్పటికైనా తనకు ఈ సమస్య తప్పదని భావించిన కూతురు ఎలాగైనా తన తల్లి అడ్డు తొలగించుకోవాలని భావించి తన స్నేహితులతో కలిసి ఆమెను చంపడానికి పథకం వేసింది. పథకం ప్రకారం తన స్నేహితులతో కలిసి కూతురు తల్లి ని చంపింది.తానే పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసి ఏమీ ఎరగనట్టు గా తన తల్లి హత్యకు గురైందని ఎవరో దుండగులు ఆమెను హత్య చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఆమె చెప్పే మాటలకు అక్కడ జరిగిన సంఘటన కు ఏమాత్రం పొంతన లేకపోవడంతో పోలీసులు తమదైన శైలిలో యువతి ని విచారించగా అసలు విషయం బయటపెట్టింది. ఈ ఘటన గురించి పోలీసులు కేసు నమోదు చేసుకొని యువతిని అదుపులోకి తీసుకున్నారు.