మహేష్, పవన్ ల యుద్ధానికి డేట్స్ మారిపోయాయా?

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఇద్దరే ఏ హీరో సినిమా వచ్చినా బాక్సాఫీస్ బద్దలు కావాల్సిందే. పైగా వీరి అభిమానుల్లోనే అతి పెద్ద రైవల్ కూడా ఉంటుంది. మరి అలాంటిది ఈ ఇద్దరి హీరోల సినిమాలు ఒకే టైం లో వస్తున్నాయి అంటే ఆ హైప్ నే ఇంకో లెవెల్లో ఉంటుంది.

మరి ఆ సమయం వచ్చే ఏడాది సంక్రాంతికి ఉంటుంది అని తమ సినిమాలు భీమ్లా నాయక్, సర్కారు వారి పాట లతో కన్ఫర్మ్ చేశారు. కానీ ఇప్పుడు ఇదే సంక్రాంతి బరిలో రాజమౌళి భారీ చిత్రం ట్రిపుల్ ఆర్ సినిమా రంగంలో దిగనుంది అని తెలుస్తుండడంతో ఈ రెండు సినిమాలు డేట్స్ మార్చుకున్నట్టు తెలుస్తుంది.

మొదటగా మార్చ్ 31న భీమ్లా నాయక్ రిలీజ్ అవుతుండగా ఏప్రిల్ 29కి సర్కారు వారి పాట మారినట్టు సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇక భీమ్లా నాయక్ సినిమాని సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా మహేష్ సినిమాకి పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే రెండిటికి కూడా థమన్ నే సంగీతం అందిస్తున్నాడు.