Crime News: వ్యాపారి ఇంట్లో 45 లక్షలు చోరీ.. పోలీసులకు నిజం చెప్పకుండా దారుణం..!

Crime News: మామూలుగా దోపిడీ దొంగలు చొరబడి చోరీ చేసి వారికి కావలసిన విలువైన వస్తువులను దొంగిలిస్తారు. దొంగతనం చేయడం అంత సులువైన విషయం ఏమీ కాదు అని మనం కొన్ని సినిమాలు చూసినపుడు అనిపిస్తుంది. అయితే దొంగలు ఏ ఇంటిని దోపిడీ చేయాలి, ఇంట్లో ఎవరు ఉంటారు, వారి దగ్గర డబ్బు, నగలు ఎన్ని ఉండవచ్చు అని గస్తి కాస్తారు. వారికి కావలసిన సమాచారం అంతా అందిన తర్వాతనే వారు దొంగతనం చేస్తారు.

అయితే రోజు రోజుకీ కొందరిలో పైశాచికత్వం పెరిగిపోతోంది. దొంగలు దొంగతనం చేయడమే కాక ఆ సమాచారం పోలీసులకు తెలియకుండా ఉండటానికి దారుణానికి పాల్పడుతున్నారు.ఇటీవల ఇలాంటి సంఘటన శివపురి జిల్లా లో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ లోని శివపురి జిల్లా బదర్వాస్ కు చెందిన కియోస్క్ ఆపరేటర్ విజయ్ సింఘాల్ ఒక ప్రైవేట్ కంపెనీ కి చెందిన ఏటీఎం ను నిర్వహిస్తున్నాడు. ఆ వ్యక్తి ఇంట్లో 45 లక్షలు చోరీ జరిగింది. ఏటీఎం ఉన్న షాప్ నుండి విజయ్ ఇంటికి దారి ఉంది. గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఏటీఎంలో డబ్బులు ఇరుక్కుపోయి అని, ఏటీఎం సరిగా పని చేయట్లేదు అని ఫోన్ వచ్చింది అని విజయ్ సింఘాల్ పేర్కొంటున్నారు.

విజయ్ ఏటీఎం ని చూద్దాం అని క్రిందకి దిగగానే, ఒక ముగ్గురు వ్యక్తులు విజయ్ సింఘాల్ ను బందీగా చేశారు,తర్వాత వారు ఇంటిలోపలికి వెళ్ళి 45 లక్షల నగదు అపహరించారు. దోచుకొని వెళ్లే వారు వెళ్ళకుండా ఒక దారుణానికి వడికట్టారు. దొంగతనం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉండటానికి విజయ్ సింఘాల్ భార్యను నగ్నంగా ఉంచి వీడియోలు తీసారు. దొంగతనం గురించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఈ వీడియోలు సోషల్ మీడియా లో పెట్టి వైరల్ చేస్తాము అని అతడిని భయపెట్టారు. ఇంట్లో ఆయన పెట్టిన సీసీ కెమెరాల గురించి కూడా వారికి తెలుసు, వారి పని అవ్వగానే సీసీ కెమెరా ఫుటేజ్ లను కూడా వెంట తీసుకొని వెళ్ళారు. శుక్రవారం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో విజయ్ సింఘాల్ దగ్గర డబ్బు ఉందని, అతను ఎప్పుడూ ఏమి చేస్తారో తెలిసిన వారే ఈ పని చేసుంటారు అని తేలింది. కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.