Crime News: ఉత్తర ప్రదేశ్ లో దారుణం .. యువతిపై సామూహిక అత్యాచారం చేసి వీడియో తీసి..!

Crime News:దేశంలో రోజురోజుకీ మహిళల మీద అత్యాచార ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. ప్రతిరోజు దేశంలో ఎక్కడో ఒక చోట మహిళల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళలు ఇంటి నుండి ఒంటరిగా బయటికి వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి పోలీసులు, ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా కూడా ఆగడాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ లో ఇటువంటి బాధాకర సంఘటన ఒకటి చోటు చేసుకుంది.

వివరాలలోకి వెళితే..ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా జిల్లాలో ఒక విద్యార్థి సాయంత్రం కాలేజ్ నుండి ఆటో ఎక్కి ఇంటికి తిరిగి వెళుతుంది. ఆటోలో ఒంటరిగా ఉన్న విద్యార్థి మీద డ్రైవర్ కన్ను పడింది. ఈ క్రమంలో డ్రైవర్ ఇంకా ఇద్దరు వ్యక్తులకు సమాచారం అందించాడు. డ్రైవర్ ఆటోని పక్క దారి పట్టించి ముగ్గురు కలిసి విద్యార్థి మీద అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా అత్యాచారానికి సంబంధి వీడియో రికార్డు చేశారు. బాధితురాలు ఈ విషయం ఎవరితో చెప్పకుండా ఆమెను కొట్టి వీడియో సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు.

నిందితుల నుండి ఎలాగో తప్పించుకొని బయటపడిన విద్యార్థి ఎత్మాద్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విద్యార్థి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని ఈ ఘటనకు పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరొక నిందితుడు పరారీలో ఉండగా అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.